- Home
- Sports
- Cricket
- జట్టులో పెట్టుకోలేము, వేలానికి వదలలేము... మెగా వేలానికి ముందు ఆ రెండు జట్లకీ వింత పరిస్థితి...
జట్టులో పెట్టుకోలేము, వేలానికి వదలలేము... మెగా వేలానికి ముందు ఆ రెండు జట్లకీ వింత పరిస్థితి...
ఐపీఎల్ 2021 సీజన్ ఇంకా పూర్తి కాలేదు. కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్2021 సీజన్లో మిగిలిన మ్యాచులను సెప్టెంబర్లో పూర్తిచేయనున్నారు. అయితే ఆ తర్వాత జరిగే ఐపీఎల్ 2022 మెగా వేలానికి సంబంధించి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

<p>ఐపీఎల్ 2022 సీజన్ను 10 జట్లతో నిర్వహించాలని భావిస్తున్న బీసీసీఐ, అందుకు తగినట్టుగానే మెగా వేలం నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది...</p>
ఐపీఎల్ 2022 సీజన్ను 10 జట్లతో నిర్వహించాలని భావిస్తున్న బీసీసీఐ, అందుకు తగినట్టుగానే మెగా వేలం నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది...
<p>మెగా వేలం నిబంధనల ప్రకారం ఏ ఫ్రాంఛైజీ అయినా అత్యధికంగా నలుగురు ప్లేయర్లను మాత్రమే అట్టిపెట్టుకునే అవకాశం ఉంటుంది. వీరిలో ఇద్దరు స్వదేశీ, ఇద్దరు విదేశీ... లేదా ముగ్గురు స్వదేశీ, ఓ విదేశీ ప్లేయర్ను రిటైన్ చేసుకునే వీలుంది...</p>
మెగా వేలం నిబంధనల ప్రకారం ఏ ఫ్రాంఛైజీ అయినా అత్యధికంగా నలుగురు ప్లేయర్లను మాత్రమే అట్టిపెట్టుకునే అవకాశం ఉంటుంది. వీరిలో ఇద్దరు స్వదేశీ, ఇద్దరు విదేశీ... లేదా ముగ్గురు స్వదేశీ, ఓ విదేశీ ప్లేయర్ను రిటైన్ చేసుకునే వీలుంది...
<p>ఒకవేళ ముగ్గురు ప్లేయర్లను అట్టి పెట్టుకుంటే మొదటి ప్లేయర్కి రూ.15 కోట్లు, రెండో ప్లేయర్కి 11, మూడో ప్లేయర్కి 7 కోట్లు, నాలుగో ప్లేయర్కి రూ.5 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అంటే అట్టిపెట్టుకున్న ప్లేయర్ల కోసమే రూ.38 కోట్లు చెల్లించాల్సి ఉంటుందన్న మాట.</p>
ఒకవేళ ముగ్గురు ప్లేయర్లను అట్టి పెట్టుకుంటే మొదటి ప్లేయర్కి రూ.15 కోట్లు, రెండో ప్లేయర్కి 11, మూడో ప్లేయర్కి 7 కోట్లు, నాలుగో ప్లేయర్కి రూ.5 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అంటే అట్టిపెట్టుకున్న ప్లేయర్ల కోసమే రూ.38 కోట్లు చెల్లించాల్సి ఉంటుందన్న మాట.
<p>అదే ముగ్గురే చాలనుకుంటే రూ.33 కోట్లు, ఇద్దరే కావాలనుకుంటే రూ.21 కోట్లు (రూ.12.5 కోట్లు+రూ.8.5కోట్లు)... ఒక్కరుంటే చాలనుకుంటే రూ.12.5 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.</p>
అదే ముగ్గురే చాలనుకుంటే రూ.33 కోట్లు, ఇద్దరే కావాలనుకుంటే రూ.21 కోట్లు (రూ.12.5 కోట్లు+రూ.8.5కోట్లు)... ఒక్కరుంటే చాలనుకుంటే రూ.12.5 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.
<p>ఈ నిబంధనలు ఐపీఎల్ ఫ్రాంఛైజీలను తెగ ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఏ ప్లేయర్ను అట్టిపెట్టుకోవాలి? ఎవరిని వదలాలనేది తేల్చడానికి ఆపసోపాలు పడే అవకాశం ఉంది...</p>
ఈ నిబంధనలు ఐపీఎల్ ఫ్రాంఛైజీలను తెగ ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఏ ప్లేయర్ను అట్టిపెట్టుకోవాలి? ఎవరిని వదలాలనేది తేల్చడానికి ఆపసోపాలు పడే అవకాశం ఉంది...
<p>ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ డేవిడ్ వార్నర్కి రూ.12.5 కోట్లు, కేన్ విలియంసన్కి రూ.3 కోట్లు, రషీద్ ఖాన్కి రూ.9 కోట్లు, మనీశ్ పాండేకి రూ.11 కోట్లు చెల్లిస్తోంది...</p>
ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ డేవిడ్ వార్నర్కి రూ.12.5 కోట్లు, కేన్ విలియంసన్కి రూ.3 కోట్లు, రషీద్ ఖాన్కి రూ.9 కోట్లు, మనీశ్ పాండేకి రూ.11 కోట్లు చెల్లిస్తోంది...
<p>వీళ్లు కాకుండా విజయ్ శంకర్కి రూ.3 కోట్ల 20 లక్షలు, భువనేశ్వర్ కుమార్కి రూ.8 కోట్ల 50 లక్షలు చెల్లిస్తోంది. వీరిలో ఐపీఎల్ 2021 సీజన్లో జరిగిన పరిణామాల కారణంగా డేవిడ్ వార్నర్ను అట్టిపెట్టుకోవాలని సన్రైజర్స్ భావించకపోవచ్చు...</p>
వీళ్లు కాకుండా విజయ్ శంకర్కి రూ.3 కోట్ల 20 లక్షలు, భువనేశ్వర్ కుమార్కి రూ.8 కోట్ల 50 లక్షలు చెల్లిస్తోంది. వీరిలో ఐపీఎల్ 2021 సీజన్లో జరిగిన పరిణామాల కారణంగా డేవిడ్ వార్నర్ను అట్టిపెట్టుకోవాలని సన్రైజర్స్ భావించకపోవచ్చు...
<p>కేన్ విలియంసన్ను అట్టిపెట్టుకుంటే, అతను కెప్టెన్ కాబట్టి రూ.3 కోట్ల నుంచి ఇకపై రూ.15 నుంచి రూ.12.5కోట్ల వరకూ చెల్లించడానికి సిద్ధంగా ఉండాలి. అలాగే మనీశ్ పాండేని అట్టిపెట్టుకున్నా అతనికి భారీగా ముట్టచెప్పాల్సిఉంటుంది...</p>
కేన్ విలియంసన్ను అట్టిపెట్టుకుంటే, అతను కెప్టెన్ కాబట్టి రూ.3 కోట్ల నుంచి ఇకపై రూ.15 నుంచి రూ.12.5కోట్ల వరకూ చెల్లించడానికి సిద్ధంగా ఉండాలి. అలాగే మనీశ్ పాండేని అట్టిపెట్టుకున్నా అతనికి భారీగా ముట్టచెప్పాల్సిఉంటుంది...
<p>నలుగురు ప్లేయర్లను అట్టిపెట్టుకునే అవకాశం ఉండడంతో ఆరేంజ్ ఆర్మీ... భువీ, మనీశ్ పాండే, రషీద్ ఖాన్, కేన్ విలియంసన్లను అట్టిపెట్టుకునే అవకాశం ఉంది...</p>
నలుగురు ప్లేయర్లను అట్టిపెట్టుకునే అవకాశం ఉండడంతో ఆరేంజ్ ఆర్మీ... భువీ, మనీశ్ పాండే, రషీద్ ఖాన్, కేన్ విలియంసన్లను అట్టిపెట్టుకునే అవకాశం ఉంది...
<p>మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్దీ ఇదే పరిస్థితి. ప్రస్తుతం సీఎస్కే కెప్టెన్గా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీకి ఏటా రూ.15 కోట్లు చెల్లిస్తోంది. సురేశ్ రైనాకి రూ.11 కోట్లు చెల్లిస్తున్నారు.</p>
మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్దీ ఇదే పరిస్థితి. ప్రస్తుతం సీఎస్కే కెప్టెన్గా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీకి ఏటా రూ.15 కోట్లు చెల్లిస్తోంది. సురేశ్ రైనాకి రూ.11 కోట్లు చెల్లిస్తున్నారు.
<p>వీళ్లు కాకుండా మొయిన్ ఆలీని రూ.7 కోట్లకు, సామ్ కుర్రాన్ని రూ.5 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేసిన సీఎస్కే, రవీంద్ర జడేజాకి రూ.9కోట్ల 20 లక్షలకు చెల్లిస్తోంది...</p>
వీళ్లు కాకుండా మొయిన్ ఆలీని రూ.7 కోట్లకు, సామ్ కుర్రాన్ని రూ.5 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేసిన సీఎస్కే, రవీంద్ర జడేజాకి రూ.9కోట్ల 20 లక్షలకు చెల్లిస్తోంది...
<p>వీరిలో మహేంద్ర సింగ్ ధోనీ, సురేశ్ రైనా ఇంకా మూడేళ్ల పాటు ఐపీఎల్లో కొనసాగుతారా? లేదా? చెప్పడం కష్టం. వీరిద్దరినీ అట్టిపెట్టుకుంటే, వాళ్లు వచ్చే సీజన్లో లేదా ఆపైన రిటైర్మెంట్ ప్రకటిస్తే సీఎస్కేకి ఇబ్బందులు తప్పవు...</p>
వీరిలో మహేంద్ర సింగ్ ధోనీ, సురేశ్ రైనా ఇంకా మూడేళ్ల పాటు ఐపీఎల్లో కొనసాగుతారా? లేదా? చెప్పడం కష్టం. వీరిద్దరినీ అట్టిపెట్టుకుంటే, వాళ్లు వచ్చే సీజన్లో లేదా ఆపైన రిటైర్మెంట్ ప్రకటిస్తే సీఎస్కేకి ఇబ్బందులు తప్పవు...
<p>పోనీ రవీంద్ర జడేజా, మొయిన్ ఆలీ, సామ్ కుర్రాన్, డుప్లిసిస్ వంటి వాళ్లను అట్టిపెట్టుకోవాలని చూస్తే... వారికి రెట్టింపు మొత్తం చెల్లించాల్సి ఉంటుంది...</p>
పోనీ రవీంద్ర జడేజా, మొయిన్ ఆలీ, సామ్ కుర్రాన్, డుప్లిసిస్ వంటి వాళ్లను అట్టిపెట్టుకోవాలని చూస్తే... వారికి రెట్టింపు మొత్తం చెల్లించాల్సి ఉంటుంది...
<p>అదీకాకుండా మహేంద్ర సింగ్ ధోనీ, సురేశ్ రైనాలను వేలానికి వదిలేస్తే జరిగే ప్రమాదం భారీగా ఉంటుంది. అసలు సీఎస్కే ఉన్న భారీ క్రేజ్కి కారణమే వీళ్లు... దీంతో సీఎస్కే ఎవరిని అట్టిపెట్టుకుంటుంది? ఎవరిని వేలానికి వదులుతుందనేది ఆసక్తికరంగా మారింది...</p>
అదీకాకుండా మహేంద్ర సింగ్ ధోనీ, సురేశ్ రైనాలను వేలానికి వదిలేస్తే జరిగే ప్రమాదం భారీగా ఉంటుంది. అసలు సీఎస్కే ఉన్న భారీ క్రేజ్కి కారణమే వీళ్లు... దీంతో సీఎస్కే ఎవరిని అట్టిపెట్టుకుంటుంది? ఎవరిని వేలానికి వదులుతుందనేది ఆసక్తికరంగా మారింది...