కియారా అద్వాణీకి తన పెళ్లి చీరను ఇచ్చిన ధోనీ భార్య సాక్షి సింగ్... కారణం ఏంటంటే...
క్రికెటర్గా రిటైర్మెంట్ తీసుకోకముందే తన బయోపిక్ రైట్స్ని రూ.100 కోట్లను అమ్మి, సంచలన క్రియేట్ చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ. క్రికెట్లో ఆయనకి ఉన్న క్రేజ్ అలాంటిది. అయితే ఆయన సతీమణి సాక్షి సింగ్కి కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది...
హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేసిన సాక్షి సింగ్, భర్తకు సంబంధించిన ఫైనాన్షియల్ విషయాలన్నీ బేషుగ్గా మేనేజ్ చేస్తూ ఉంటుంది. అంతేకాదు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటుంది...
మహేంద్ర సింగ్ ధోనీ జీవితకథ (సగం కల్పితం+ సగం వాస్తవ కథ) ఆధారంగా రూపొందిన ‘ఎమ్మెస్ ధోనీ- ది అన్టోల్డ్ స్టోరీ’ సినిమా విషయంలో కూడా సాక్షి సింగ్ రావత్ చాలా కేర్ తీసుకుందట.
ఈ సినిమాలో ధోనీ భార్య సాక్షి పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వాణీ నటించిన విషయం తెలిసిందే. కియారా అచ్చు తనలా బిహేవ్ చేసేలా, తనలా డ్రెస్సింగ్ చేసుకునేలా అనేక జాగ్రత్తలు తీసుకుందట సాక్షి రావత్...
ఈ మూవీలో పెళ్లి సీన్లలో కియారా అద్వాణీ ధరించే చీర, ధోనీ భార్య సాక్షి రావత్దే. ఈ సీన్ కోసం తన చీరను కియారాకి ఇచ్చిన సాక్షి సింగ్ రావత్, ఆ సన్నివేశం షూట్ చేసిన తర్వాత తిరిగి తీసేసుకుందట...
పెళ్లినాటి గుర్తుగా ఎప్పటికీ ఆ చీర తనతో ఉండాలని సాక్షి సింగ్ ఆశపడిందని, అందుకే ఆ షాట్ కోసం కియారాకి ఇచ్చి మళ్లీ వెనక్కి తీసేసుకుందని చిత్ర యూనిట్ తెలిపింది.
మహేష్తో ‘భరత్ అనే నేను’, రామ్చరణ్తో ‘వినయ విధేయ రామ’ చిత్రాల్లో నటించిన కియారా, తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ గుర్తింపు ఉన్నాయి.
ప్రస్తుతం తెలుగులో చిరంజీవి ‘ఆచార్య’ సినిమాలో రామ్చరణ్ సరసన హీరోయిన్గా నటిస్తున్న కియారా, బాలీవుడ్లో వరుస ఆఫర్లతో యమా బిజీగా గడిపేస్తోంది...
తాజాగా ఎల్లో కలర్ బికినీలో పూల్ ఒడ్డున్న నిల్చున్న హాట్ ఫోటోను పోస్టు చేసిన కియారా... దబూ రతానీ క్యాలెండర్ కోసం అందాలన్నీ ఆరబోసి ట్రెండింగ్లో నిలిచింది..