మాహీ భాయ్ కోసం చావడానికైనా మేం రెఢీ... కెఎల్ రాహుల్ కామెంట్...
క్రికెట్ వరల్డ్లో ధోనీ క్రేజ్, ఫాలోయింగ్ వేరు. చాలామంది యువ క్రికెటర్లకు ధోనీయే రోల్ మోడల్. టీమిండియా ఫ్యూచర్ స్టార్గా గుర్తింపు దక్కించుకున్న కెఎల్ రాహుల్కి కూడా ధోనీయే ఫెవరెట్. అవసరమైతే ధోనీ కోసం చావడానికైనా రెఢీ అంటున్నాడు క్రికెటర్ రాహుల్...
ఐపీఎల్ 2021 సీజన్లో కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన కెఎల్ రాహుల్కి అపెండిక్స్ ఆపరేషన్ జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తిరిగి బ్యాటు పట్టలేదు కెఎల్ రాహుల్...
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్కి ఎంపికైనా తుది 15 మంది జట్టులో కూడా రాహుల్కి ప్లేస్ ఇవ్వలేదు టీమిండియా. అయితే ఇంగ్లాండ్తో జరిగే ఐదు టెస్టుల సిరీస్లో మాత్రం కెఎల్ రాహుల్ రీఎంట్రీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది...
తాజాగా ఫోర్బ్ ఇండియా మ్యాగజైన్కి ఇంటర్వ్యూ ఇచ్చిన కెఎల్ రాహుల్, కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు... ‘ఎవరైనా కెప్టెన్ అంటే నాకు ముందుగా గుర్తుకు వచ్చే పేరు ఎమ్మెస్ ధోనీ...
మేమంతా ధోనీ కెప్టెన్సీలో ఆడాం. చాలా టోర్నమెంట్స్ గెలిచాం. దేశం కోసం ఎన్నో అద్భుతమైన విజయాలను అందించగలిగాం... ఓ కెప్టెన్కి దక్కే అతిపెద్ద అఛీవ్మెంట్ ఏంటంటే తన జట్టు ప్లేయర్లు ఇచ్చే నిజమైన గౌరవమే...
మాహీ దాంట్లో ఎప్పుడో సూపర్ సక్సెస్ అయ్యాడు. నేనే కాదు, జట్టులోని వాళ్లంతా ఏ ఆలోచన లేకుండా మాహీ కోసం బుల్లెట్ దెబ్బలు తినడానికి కూడా రెఢీగా ఉంటాం...
ధోనీ నుంచి నేను నేర్చుకున్న గొప్ప విషయం, అతని వినయం. జీవితంలో ఎన్ని విజయాలు వచ్చినా, ఎంత ఎత్తుకు ఎదిగినా ఎంతో వినయంగా ఉండడం మాహీలోనే చూశాను...
మాహీకి దేశమే మిన్న, మిగిలినవన్నీ చాలా చిన్న విషయాలు. దేశానికి, దేశాన్ని ప్రజెంట్ చేసే జట్టుకి మాహీ ఇచ్చే గౌరవం, విలువ వెలకట్టలేనివి...’ అంటూ కామెంట్ చేశాడు కెఎల్ రాహుల్...
మాహీతో పాటు విరాట్ కోహ్లీ కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు కెఎల్ రాహుల్... ‘ధోనీతో పోలిస్తే విరాట్ కోహ్లీ చాలా డిఫెరెంట్ కెప్టెన్. వ్యక్తిగతంగా, కెప్టెన్గా అతని పూర్తి నిబద్ధతతో ఉంటాడు...
జట్టుకోసం నూటికి 200 శాతం ఇవ్వడానికి రెఢీగా ఉంటాడు. ఎవ్వరైనా 100 ఇస్తే సరిపోతుందని అనుకుంటారు. కానీ విరాట్ కోహ్లీ మాత్రం తనకి తాను 200 శాతం ఇచ్చినా సంతృప్తి చెందడు.
ఒంటరిగా జట్టులోని 10 మంది ప్లేయర్ల భారాన్ని మోయగల సామర్థ్యం విరాట్ కోహ్లీ సొంతం. అతనో సూపర్ స్టార్’ అంటూ కామెంట్ చేశాడు లోకేశ్ రాహుల్...