MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • మైసూర్‌లో ధోనీ మైనపు బొమ్మ... ఆదిపురుష్‌కి వీఎఫ్‌క్స్ చేసినోడే, ఈ బొమ్మ చేశాడా ఏంది...

మైసూర్‌లో ధోనీ మైనపు బొమ్మ... ఆదిపురుష్‌కి వీఎఫ్‌క్స్ చేసినోడే, ఈ బొమ్మ చేశాడా ఏంది...

టీమిండియాకి మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోనీ ఒకడు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న మాహీకి మైసూర్‌లోని వ్యాక్స్ మ్యూజియంలో మైనపు విగ్రహం రూపొందించారు మ్యూజియం నిర్వాహకులు. తాజాగా ఓ అభిమాని, ఈ మాహీ మైనపు బొమ్మ దగ్గర ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. కొద్దిసేపటికే ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది... అయితే ఈ బొమ్మ చూడడానికి మాహీలా ఉండకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Oct 08 2022, 01:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మాహేంద్ర సింగ్ ధోనీ మైనపు బొమ్మ చేసిన వాడు, మాహీతో పాటు రణ్‌బీర్ కపూర్‌కి కూడా అభిమాని అయ్యుంటాడు. అందుకే ఒకే బొమ్మలో ఇద్దరినీ కలిపి దింపేశాడు. ఇది మాహీ స్టాచ్యూలా లేదు, మహిబీర్ స్టాచ్యూలా ఉంది... అంటూ ఓ అభిమాని కామెంట్ చేశాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కొందరు ఇది మహేంద్ర సింగ్ ధోనీ బొమ్మలా లేదని, ఓ వైపు నుంచి చూస్తుంటే టాలీవుడ్ హీరో మహేష్ బాబులా, మరో వైపు నుంచి పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌లా ఉందని కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఆ హెయిర్ స్టైల్ ఏదైతే ఉందో అది హైలైట్ అంటున్నారు అభిమానులు... 

36

‘ఆదిపురుష్’ సినిమాకి వీఎఫ్‌ఎక్స్ వర్క్ చేసిన వాడే, మహేంద్ర సింగ్ ధోనీ వ్యాక్స్ స్టాచ్యూని తయారుచేసి ఉంటాడు... ఆ పనితనం ఇట్టే కనిపిస్తోంది...’ అంటూ మరో అభిమాని వ్యంగ్యంగా పోస్టు చేశాడు. మాహీని గౌరవించాలనే ఉద్దేశంతో వ్యాక్స్ స్టాచ్యూ చేశారా? లేక అవమానించే ఉద్దేశంతోనే ఇలా తయారుచేశారా? అంటూ ధోనీ ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు..

46

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు ఫేస్‌బుక్‌ లైవ్‌లోకి వచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ... ఓరియో బిస్కెట్ ప్రమోషన్ చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ‘2011లో ఓరియో బిస్కెట్ ఇండియాకి వచ్చింది, టీమిండియా వరల్డ్ కప్ గెలిచింది...’ అంటూ మాహీ చేసిన కామెంట్లు కూడా ట్రోలింగ్‌కి కారణమయ్యాయి...

56
Image credit: MS Dhoni/Facebook

Image credit: MS Dhoni/Facebook

2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన మహేంద్ర సింగ్ ధోనీ, ఐపీఎల్ 2022 సీజన్‌కి ముందు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. అయితే కొత్త సారథిగా బాధ్యతలు తీసుకున్న జడేజా, సీజన్ మధ్యలోనే తప్పుకోవడంతో మళ్లీ కెప్టెన్‌గా నియమించబడ్డాడు మాహీ...

66

2023 ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును మహేంద్ర సింగ్ ధోనీయే నడిపించబోతున్నాడని ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది సీఎస్‌కే మేనేజ్‌మెంట్. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో అభిమానుల మధ్య మ్యాచ్ ఆడిన తర్వాత ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటానని స్వయంగా ప్రకటించాడు మహేంద్ర సింగ్ ధోనీ... 

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2026 Final: గిల్ ప్లాన్ రివర్స్.. గుజరాత్ టైటాన్స్‌ను ఓడిపోవడానికి టాప్ 5 కారణాలు ఇవే !
Recommended image2
RCB: ఫైన‌ల్‌లో కోహ్లీ విశ్వ‌రూపం.. ఐపీఎల్ చ‌రిత్ర‌లో అరుదైన ఘ‌న‌త సాధించిన కింగ్
Recommended image3
RCB vs GT IPL 2026 Final: వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన ఆర్సీబీ.. కింగ్ కోహ్లీ ఊచకోత !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved