- Home
- Sports
- Cricket
- T20 World Cup : విండీస్ పై సూపర్ విక్టరీ.. ఇండియా ఉమెన్స్ టీంను గెలిపించిన టాప్ అంశాలివే
T20 World Cup : విండీస్ పై సూపర్ విక్టరీ.. ఇండియా ఉమెన్స్ టీంను గెలిపించిన టాప్ అంశాలివే
మహిళల T20 ప్రపంచ కప్ 2026 వార్మప్ మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 26 పరుగుల తేడాతో గెలిచింది. స్పిన్నర్లు శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్ అదరగొట్టారు. భారతీ ఫుల్మాలీ హాఫ్ సెంచరీతో ఆకట్టుకుంది. ఇలా ఈ మ్యాచ్ లో ఇండియన్ ఉమెన్స్ టీంను గెలిపించిన అంశాలివే..

టీ20 వరల్డ్ కప్ లో టిమిండియాకు అదిరిపోయే ఆరంభం...
మహిళల T20 ప్రపంచ కప్ 2026కు ముందు జరిగిన వార్మప్ మ్యాచ్లో టీమిండియా అదరగొట్టింది. నిన్న (జూన్ 8, సోమవారం) కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్పై 26 పరుగుల తేడాతో గెలిచింది. జూన్ 14న ఇంగ్లండ్, వేల్స్లో ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీకి ముందు భారత అమ్మాయిలకు ఇది తొలి వార్మప్ గేమ్.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 179/8 స్కోరు చేసింది. బౌలింగ్ లోనూ రాణించిన మన అమ్మాయిలు విండీస్ను 153/8కే కట్టడి చేశారు. భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 4/36తో సత్తా చాటగా, రాధా యాదవ్ 3 వికెట్లు పడగొట్టింది. ఇలా అన్ని విభాగాల్లో ఆధిపత్యం వహించి అద్భుత విజయం సాధించిన టీమిండియా విజయం వెనకున్న కీలక అంశాలేంటో ఇప్పుడు చూద్దాం.
1. ఓపెనర్లు మెరుపు స్టార్ట్
టీమిండియా వైస్-కెప్టెన్ స్మృతి మంధాన (39), షఫాలీ వర్మ (29) భారత ఇన్నింగ్స్కు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఈ ఇద్దరూ కేవలం 5.1 ఓవర్లలోనే 59/0 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మంధాన 169.57 స్ట్రైక్ రేట్తో, షఫాలీ 223.08 స్ట్రైక్ రేట్తో చెలరేగారు. పవర్ప్లేలో వీళ్లిచ్చిన బలమైన పునాది మిడిల్ ఆర్డర్కు బాగా ఉపయోగపడింది. ఇంగ్లండ్తో జరిగిన T20I సిరీస్లో ఫామ్ కోల్పోయిన ఈ జోడీ, ఈ మ్యాచ్తో మళ్లీ గాడిలో పడినట్టు కనిపించింది. ఇది టోర్నీకి ముందు టీమ్ మేనేజ్మెంట్కు మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది.
2. భారతీ వీరబాదుడు
3. మిడిల్ ఆర్డర్ వైఫల్యం
వెస్టిండీస్పై గెలిచినప్పటికీ టీమిండియా మిడిలార్డర్ బలహీనత మరోసారి బయటపడింది. భారతీ ఫుల్మాలీ, యాష్టికా భాటియా నాలుగో వికెట్కు 61 పరుగుల భాగస్వామ్యంతో ఇన్నింగ్స్ను చక్కదిద్దినా, ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు దానిని నిలబెట్టుకోలేకపోయారు. రిచా ఘోష్, రాధా యాదవ్ వంటి కీలక బ్యాటర్లు త్వరగా ఔటయ్యారు. 146/4 స్కోరుతో పటిష్టంగా ఉన్న భారత్, కేవలం 16 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయి 162/7కి పడిపోయింది. సెట్ అయిన బ్యాటర్లు ఔటయ్యాక మిడిలార్డర్ కుప్పకూలుతుందనే ఆందోళన ఈ మ్యాచ్తో మళ్లీ స్పష్టమైంది.
4. మ్యాచ్ ను తిప్పేసిన స్పిన్నర్లు
వెస్టిండీస్ ఛేజింగ్లో మంచి ఆరంభం లభించినా, భారత స్పిన్నర్లు రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్ వారి జోరుకు బ్రేకులు వేశారు. విండీస్ ఓపెనర్లు డీండ్రా డాటిన్ (49), షెమైన్ క్యాంప్బెల్ (25) తొలి వికెట్కు 63 పరుగులు జోడించారు. కానీ క్యాంప్బెల్ ఔటయ్యాక విండీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. 63/1 నుంచి 113/7కి పడిపోయింది. అంటే 50 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలమైనా, మన స్పిన్నర్లు టర్న్ రాబట్టి విండీస్ బ్యాటర్లను కట్టడి చేశారు. ఇదే మ్యాచ్లో నిర్ణయాత్మక పాత్ర పోషించింది.

