శిఖర్ ధావన్కు బర్త్ డే విషెస్ తెలిపిన వీరేంద్ర సెహ్వాగ్... అయితే ఓ ఫన్నీ ట్విస్టుతో...
మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ చమత్కారం, చతురత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఫన్నీగా ట్రోల్ చేస్తూ, నవ్వుల పువ్వులు పూయిస్తూ సోషల్ మీడియాలో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు వీరూ. తాజాగా పుట్టినరోజు జరుపుకుంటున్న భారత ఓపెనర్ శిఖర్ ధావన్కి ఇదే విధంగా బర్త్ డే విషెస్ తెలియచేశాడు వీరూ.
‘ఎప్పుడూ నవ్వుతూ ఉండే శిఖర్ ధావన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు.. క్రీజులో వేల పరుగులు చేయ్యి. రాబోయే మ్యాచుల్లో కూడా ఇలాగే పరుగులు సాధించు.. ప్రతీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకో... ఇలాంటి సెలబ్రేషన్ ఎన్నో రావాలని కోరుకుంటున్నా... దాంతో అన్నీ ఎర్రగా మారాలి’ అంటూ రాసుకొచ్చాడు వీరూ.
అయితే శిఖర్ ధావన్కి బదులుగా అతనిలా ఉండే ఓ డూప్ ఫోటోను పోస్టు చేశాడు వీరేంద్ర సెహ్వాగ్. వీరూ పోస్టు చేసిన సదరు వ్యక్తి పాన్ వేసుకోవడంతో నోరు ఎర్రగా ఉంది. దానికి సింబలిక్గానే చివరి లైన్లో ఎర్రగా మారాలి... అంటూ జోడించాడు వీరూ.
239 అంతర్జాతీయ మ్యాచులు ఆడిన శిఖర్ ధావన్... 24 శతకాలతో 9709 పరుగులు చేశాడు. అత్యంత వేగంగా ఐసీసీ టోర్నమెంట్లలో 1000 పరుగులు పూర్తిచేసుకున్న క్రికెటర్గా ఉన్నాడు ‘గబ్బర్’.
ఐపీఎల్లో 13వ సీజన్లో తొలి సెంచరీ బాదిన శిఖర్, వరుసగా రెండు మ్యాచుల్లో సెంచరీలు బాదిన ఏకైక క్రికెటర్గా కూడా నిలిచాడు...
2014లో విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్న శిఖర్ ధావన్, మొదటి టెస్టులో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్గా ఉన్నాడు...
శిఖర్ ధావన్ తన ఆరంగ్రేటం టెస్టులో 187 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 177 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు...
2013 ఛాంపియన్స్ ట్రోఫీ, 2015 వరల్డ్ కప్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2019 వరల్డ్కప్... ఇలా వరుసగా నాలుగు ఐసీసీ టోర్నీల్లో సెంచరీ నమోదుచేసిన ఏకైక క్రికెటర్ శిఖర్ ధావన్.
హర్భజన్ సింగ్ గుజరాతీలో శిఖర్ ధావన్కి విషెస్ తెలిపాడు... ‘దేవుడు నీకు ఎప్పుడూ సంతోషం, ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నా... హ్యాపీ బర్త్ డే’ అంటూ గుజరాతీలో ట్వీట్ చేశాడు భజ్జీ.
16 ఇన్నింగ్స్ల్లోనే ఐసీసీ వన్డే టోర్నమెంట్లలో 1000 పరుగులు పూర్తిచేసుకున్న క్రికెటర్గా నిలిచాడు శిఖర్ ధావన్...
‘ఆసుపత్రి బెడ్ మీద కూడా నవ్వుతూ ఉండేవాడు... టూర్ ముగిసేసమయానికి నీ తొడ ఎర్రగా అవుతుందని ఆశిస్తున్నా... హ్యాపీ బర్త్ డే శిఖర్ ధావన్’ అంటూ పోస్టు చేశాడు వసీం జాఫర్.
క్యాచ్ పట్టిన తర్వాత తొడ కొట్టి, మీసం తిప్పుతూ... సెంచరీ తర్వాత మీసం కట్టు మెలివేస్తూ శిఖర్ ధావన్ చేసుకునే సెలబ్రేషన్స్కి మంచి క్రేజ్ ఉంది...
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో పోటీ పడి పరుగులు చేసిన శిఖర్ ధావన్... గాయాల కారణంగా జట్టులో స్థిరమైన చోటు సంపాదించుకోలేకపోతున్నాడు...
అండర్ 19 వరల్డ్కప్లో 505 పరుగులు చేసిన శిఖర్ ధావన్... ఒకే టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా నిలిచాడు. శిఖర్ ధావన్ నేడు 35వ ఒడిలోకి అడుగుపెడుతున్నాడు.