కోహ్లీ అతన్ని చూశావా... నీకు భయపడే రకం కాదు... వీరేంద్ర సెహ్వాగ్ సెటైర్!
IPL 2020 సీజన్లో అదరగొడుతున్నాడు ముంబై ఇండియన్స్ యంగ్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్. గత మూడు సీజన్లలో అద్బుతంగా రాణిస్తున్నా భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు సూర్యకుమార్ యాదవ్. ఆస్ట్రేలియా సిరీస్కి సూర్యకుమార్ యాదవ్ను ఎంపిక చేయకపోవడం సెలక్టర్లపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, వీరేంద్ర సెహ్వాగ్ లాంటివాళ్లు కూడా సూర్యకుమార్ యాదవ్ను ఎంపిక చేయకపోవడంపై నిరాశవ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
తాజాగా మరోసారి సూర్యకుమార్ యాదవ్ను పొగడ్తల్లో ముంచెత్తాడు వీరేంద్ర సెహ్వాగ్. అతని ఆటతీరుతో పాటు యాటిట్యూడ్ కూడా తనకు భలే నచ్చేసిందంటూ వ్యాఖ్యానించాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో మంచి విజయం అందుకుంది ముంబై ఇండియన్స్. రోహిత్ శర్మ లేకపోయినా సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ విన్నింగ్స్ ఇన్నింగ్స్తో అదరగొట్టాడు.
43 బంతుల్లోనే 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 79 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, బౌండరీ బాది మ్యాచ్ను ముగించాడు. అయితే 13వ ఓవర్లో చాహాల్ బౌలింగ్ను సూర్యకుమార్ యాదవ్ను సెడ్జ్ చేశారు విరాట్ కోహ్లీ.
సూర్యకుమార్ యాదవ్ కొట్టిన బంతిని పట్టుకోబోయిన విరాట్ కోహ్లీ... ఆ స్టోక్ కారణంగా కాస్త ఇబ్బంది పడ్డాడు. దీంతో సూర్యకుమార్ యాదవ్ దగ్గరికి వెళ్లి సెడ్జ్ చేశారు కోహ్లీ.
అయితే విరాట్ కోహ్లీ కోపంగా చూస్తున్నా సూర్యకుమార్ యాదవ్ కూల్గా బబుల్ గమ్ నములుతూ ఉన్నాడు... దీనిపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు వీరేంద్ర సెహ్వాగ్.
‘ముంబై వర్సెస్ బెంగళూరు ఓ అద్భుతమైన మ్యాచ్... ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ ఆడిన ఇన్నింగ్స్ నాకు భలే నచ్చేసింది. అది ఓ అసాధారణ ఇన్నింగ్స్...
కోహ్లీకి తన సత్తా ఏంటో షాట్లతో చూపించేశాడు సూర్యకుమార్ యాదవ్. టీమ్ సెలక్షన్ విషయాన్ని పట్టించుకోకుండా అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు..
సూర్యకుమార్ యాదవ్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా విరాట్ కోహ్లీకి పెద్దగా ఫలితం దక్కలేదు. కూల్ యాటిట్యూడ్తో తాను భయపడే రకం కాదని తన స్టైల్లో చూపించాడు సూర్యకుమార్ యాదవ్’ అంటూ వ్యాఖ్యానించాడు వీరేంద్ర సెహ్వాగ్.
ఆస్ట్రేలియా సిరీస్లో చోటు దక్కకపోయినా త్వరలోనే భారత జట్టులోకి సూర్యకుమార్ యాదవ్ ఎంట్రీ ఇస్తాడని అంటున్నాడు వీరేంద్ర సెహ్వాగ్...
‘ఇతనిలో దమ్ము ఉంది. త్వరలోనే ఇతని నెంబర్ వస్తుంది. అందులో అనుమానం లేదు. వరుసగా మూడు బ్లాక్ బస్టర్ సీజన్లు. సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ అద్భుతం’ అన్నాడు వీరేంద్ర సెహ్వాగ్.
ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన ఇచ్చిన వరుణ్ చక్రవర్తి లాంటివాళ్లకి భారత జట్టులో చోటు దక్కిందని, అలాగే కుర్రాళ్లు త్వరలోనే టీమిండియాలోకి వస్తాడని అంటున్నాడు వీరేంద్ర సెహ్వాగ్.