ఒక్కో వాటర్ బాటిల్ రూ.600... విరాట్ కోహ్లీ రేంజ్ మామూలుగా లేదుగా...
భారత సారథి విరాట్ కోహ్లీ బ్రాండ్ వాల్యూ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్రాండ్ అంబాసిడర్గానే దాదాపు రూ.700 కోట్లు ఆర్జిస్తున్నాడు విరాట్. ప్రపంచంలోనే అత్యధిక మంది ఫాలోవర్లు కలిసి అథ్లెట్లలో ఒకడైన విరాట్ కోహ్లీ... తాగే నీటి కోసం ఎంత ఖర్చుపెడుతున్నాడో తెలుసా...
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్ ఎవియన్లోని మినిరల్ వాటర్ మాత్రమే తాగుతానని ప్రకటించాడు భారత సారథి విరాట్ కోహ్లీ...
ఎవియన్ వాటర్ బాటిల్ ఖరీదు లీటర్కి రూ. 600. అంటే మనిషి సగటున అవసరమైన 4 లీటర్ల నీళ్లు తాగేందుకు విరాట్ కోహ్లీ వెచ్చించే ఖర్చు రూ.2400...
అంటే కేవలం మంచి నీళ్ల బాటిళ్ల కోసం విరాట్ కోహ్లీ నెలరోజుల్లో వెచ్చించే మొత్తం రూ.72 వేలు... దేశంలో సగం మంది జనాభా నెలకి ఇందులో 25 శాతం కూడా సంపాదనతోనే బతుకుతున్నారు..
ఎవియన్ వాటర్ బాటిల్ పారిస్ నుంచి దిగుమతి చేయబడుతున్నాయి. నిజానికి ఫ్రాన్స్లో ఈ బాటిల్ ఖరీదు సగానికంటే తక్కువే... దిగుమతి ఖర్చులతో పాటు అనేక కారణాల వల్ల ప్రైజ్ రెట్టింపు అవుతోంది...
కరోనా వైరస్ కారణంగా పీఈటీ కిట్ల గురించి అందరికీ తెలిసిందే. ఎవియన్ వాటర్ను పీఈటీ బాటిల్స్తో నింపుతారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రీ సైకిల్ చేయగల వాటర్ బాటిళ్లు ఇవే...
పీఈటీ వాటర్ బాటిళ్లలో నీటిని నింపేముందు అనేక పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ టెస్టుల కారణంగా వాటర్ బాటిల్ ఖరీదు విపరీతంగా పెరిగిపోతుంది...
అత్యంత స్వచ్ఛమైన నీళ్లు గల దేశంగా ఉన్న ఫ్రాన్స్ నుంచి నీళ్లు, అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్లో ప్యాక్ చేయబడి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయబడతాయి... అందుకే ఎవియన్కి మంచి బ్రాండ్ వాల్యూ లభించింది...
పెళ్లికి ముందు మాంసాహారం, గుడ్లు తీసుకునే విరాట్ కోహ్లీ... అనుష్క శర్మతో వివాహమైన తర్వాత పూర్తి శాకాహారిగా మారిపోయాడు. ఇప్పుడు గుడ్లతో పాటు పాలతో తయారైన డైరీ ప్రొడక్టులు కూడా తీసుకోడు విరాట్ కోహ్లీ...
పెటర్నిటీ లీవ్ ద్వారా ఆస్ట్రేలియాతో మొదటి టెస్టు ముగిసిన తర్వాత స్వదేశానికి వచ్చిన విరాట్ కోహ్లీ... ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ కోసం చెన్నైలో క్వారంటైన్లో గడుపుతున్నాడు.