అంటే ఇన్ని రోజులు బాల్ చూడకుండానే షాట్స్ ఆడావా కోహ్లీ... విరాట్ వ్యాఖ్యలపై ట్రోలింగ్...
మొదటి టీ20 మ్యాచ్లో డకౌట్ అయిన విరాట్ కోహ్లీ...
రెండో టీ20లో రికార్డు హాఫ్ సెంచరీతో అద్భుతమైన కమ్బ్యాక్...
తన ఇన్నింగ్స్లో ఏబీడీ ఇచ్చిన సలహాకి కూడా క్రెడిట్ ఉందన్న టీమిండియా కెప్టెన్...
కొన్నిరోజులుగా సరైన ఫామ్లో లేక ఇబ్బంది పడుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ్తో జరిగిన రెండో టీ20లో తనదైన స్టైల్లో విరుచుకుపడ్డాడు.
49 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 73 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ... టీ20ల్లో 3 వేల పరుగుల మైలురాయి అందుకున్న మొట్టమొదటి క్రికెటర్గా నిలిచాడు.
అయితే మ్యాచ్ అనంతరం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏబీ డివిల్లియర్స్ ఇచ్చిన సలహాను ఫాలో అయ్యానంటూ కోహ్లీ చేసిన కామెంట్లు ట్రోలింగ్కి కారణమయ్యాడు...
‘మ్యాచ్కి ముందు నేను ఏబీడీతో ఛాట్ చేశాను... నా ఇబ్బంది గురించి చెబితే... ‘‘జస్ట్ బంతిని చూసి ఆడు’’ అని చెప్పాడు. నేను దాన్నే ఫాలో అయ్యాను... ’ అంటూ చెప్పాడు విరాట్ కోహ్లీ.
ఈ సమాధానం, తీవ్రమైన ట్రోలింగ్కి కారణమైంది. ఏబీ డివిల్లియర్స్ చెబితే బాల్ చూసి ఆడావు... అంటే ఇన్ని రోజులు బాల్ చూడకుండానే అంపైర్ టోపీని, బౌలర్ ముఖాన్ని చూస్తూ బ్యాటింగ్ చేశావా కోహ్లీ... అంటూ కామెంట్లతో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
ప్రస్తుత తరంలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా ఉన్న విరాట్ కోహ్లీ, కేవలం ఏబీడీతో తనకున్న అనుబంధాన్ని తెలియచేయడానికి ఇలాంటి సమాధానం చెప్పాడని, దాన్ని ట్రోల్ చేయాల్సిన అవసరం లేదంటున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్.
ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఆడే విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్ మధ్య మంచి అనుబంధం ఏర్పడిన విషయం తెలిసిందే. ఏబీడీ కూడా విరాట్ కోహ్లీ తనకి దేవుడిచ్చిన సోదరుడంటూ చాలాసార్లు ప్రకటించాడు.