మహేంద్ర సింగ్ ధోనీ నుంచి ఉమేశ్ యాదవ్ దాకా... ఆ ప్రత్యేకమైన జాబితాలో చేరిన విరాట్ కోహ్లీ...
First Published Jan 12, 2021, 12:26 PM IST
భారత సారథి విరాట్ కోహ్లీ, జనవరి 11న తండ్రి అయ్యాడు. విరాట్ కోహ్లీ సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వరల్డ్ మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ జంటకు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురుస్తోంది. తండ్రి అయ్యానంటూ విరాట్ కోహ్లీ అభిమానులతో పంచుకున్న పోస్టుకి 34 నిమిషాల్లోనే 100K లైకులు వచ్చాయి. అతి తక్కువ సమయంలో ఈ ఫీట్ సాధించిన పోస్టుగా రికార్డు కూడా క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ. క్రికెటర్లలో ఓ ప్రత్యేకమైన కెటగిరీలో చేరాడు విరాట్ కోహ్లీ..

ప్రస్తుత జట్టులో ధోనీ, రోహిత్ శర్మ, రహానే, పూజారా, అశ్విన్, రైనా, సాహా, షమీ, ఉమేశ్ యాదవ్, నటరాజన్లకు అమ్మాయిలు జన్మించారు. తాజాగా ఈ జాబితాలోకి విరాట్ కోహ్లీ కూడా చేరాడు.

భారత క్రికెట్ తుది జట్టులో ఉండే 11 మంది సభ్యులకు అమ్మాయిలే జన్మించడంతో భవిష్యత్తులో వుమెన్స్ ఎలెవన్ జట్టు తయారయ్యిందని సోషల్ మీడియాలో జోక్స్ వినిపిస్తున్నాయి...
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?