విరాట్ కోహ్లీ వల్లే టీమిండియా ఇలా మారింది... సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ సంచలన వ్యాఖ్యలు...
మహేంద్ర సింగ్ ధోనీ నుంచి భారత జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు విరాట్ కోహ్లీ. తొలుత టెస్టులకు గుడ్బై చెప్పిన మాహీ, ఆ తర్వాత ఆరేళ్లకు పొట్టి ఫార్మాట్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ధోనీ నుంచి కోహ్లీ చేతుల్లోకి వచ్చాక టీమ్ పర్ఫామెన్స్ చాలా మారింది...
ముఖ్యంగా విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించిన సమయంలో భారత జట్టు, ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో ఏడో స్థానంలో ఉంది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో చారిత్రక విజయాలు అందుకున్న భారత జట్టు, టెస్టుల్లో నెం.1 ర్యాంకును అందుకుంది.
ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్లో కూడా అత్యధిక విజయాలు అందుకుని టాప్లో నిలిచింది టీమిండియా. దీనికి అంతటికీ భారత జట్టులో విరాట్ కోహ్లీ తీసుకొచ్చిన మార్పులే కారణమంటున్నాడు సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ...
‘విరాట్ కోహ్లీ కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జట్టు రూపు రేఖలు మొత్తం మార్చేశాడు. విరాట్కి ఫిట్నెస్పైన శ్రద్ధ చాలా ఎక్కువ. పర్ఫెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేస్తూ, టీమ్లో ప్రతీ ఒక్కరికీ ఉదాహరణగా నిలుస్తున్నాడు.
ఇప్పుడు జట్టులో విరాట్ కోహ్లీతో పాటు చాలామందికి పర్ఫెక్ట్ ఫిజిక్ ఉంది. దీనికి కారణం కెప్టెన్ ఇచ్చిన స్ఫూర్తియే. ఇంతకుముందు ముందు ఎప్పుడూ నేను ఫ్యాట్ పర్సెంటేజ్ గురించి వినలేదు...
ఇప్పుడు ఆటగాళ్ల ఫ్యాట్ పర్సెంటేజ్ గురించి మాట్లాడుతున్నారు. ప్రతీ ప్లేయర్ ఫిజిక్ను ఎలా మెయింటైన్ చేసుకోవాలో సూచనలు ఇస్తున్నారు, పోషకాలతో నిండిన డైట్ మెయింటైన్ చేస్తున్నారు...
ఒకప్పుడు బాగా తింటేనే క్రికెట్లో బాగా రాణిస్తారని అనేవాళ్లు. కానీ విరాట్ కోహ్లీ అది నిజం కాదని రుజువు చేశాడు. ఫిట్నెస్ మెయింటైన్ చేస్తే, గ్రౌండ్లో అద్భుతాలు చేయవచ్చని నిరూపించాడు...
విరాట్ కోహ్లీ కారణంగానే నేను కూడా డైట్ ఫాలో అవ్వడం నేర్చుకున్నాను. ఫాస్ట్ ఫుడ్ తినడం పూర్తిగా మానేశాను. అది తినకూడదని నాకు ఎవ్వరూ చెప్పలేదు. కానీ టీమ్ కోసం నాకు నేను నిర్ణయం తీసుకున్నా...
ఇప్పుడు ఉదయం నుంచి రాత్రి పడుకునేదాకా తీసుకునే ప్రతీ ఆహారం విషయంలో ఎంతో కేర్ తీసుకుంటున్నా. పర్ఫెక్ట్ డైట్ ఫాలో అవుతున్నా... ఇది మంచి ఫలితాన్నే ఇచ్చింది’ అంటూ చెప్పుకొచ్చాడు ఇషాంత్ శర్మ...
ఐపీఎల్ 2020 సీజన్లో గాయపడి ఆస్ట్రేలియా టూర్ మొత్తానికి దూరమైన ఇషాంత్ శర్మ... ఆ తర్వాత ఇంగ్లాండ్ సిరీస్లో అద్భుతంగా రాణించారు.
కపిల్ దేవ్ తర్వాత 100 టెస్టులు ఆడిన భారత పేసర్గా నిలిచిన ఇషాంత్ శర్మ, 300 వికెట్ల క్లబ్లో చోటు దక్కించుకున్నాడు. 100 టెస్టుల్లో 303 వికెట్లు తీసిన ఇషాంత్ శర్మ, ఐసీసీవరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం సిద్ధమవుతున్నాడు.