MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠకు విరాట్ కోహ్లీ-అనుష్క శర్మలు..

అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠకు విరాట్ కోహ్లీ-అనుష్క శర్మలు..

Ram Mandir - Virat Kohli: అయోధ్యలో రామ మందిర ప్రాణప్రతిష్ఠకు ముందు పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. జనవరి 22న జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. వీరిలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆయన సతీమణి అనుష్క శర్మలకు కూడా ఆహ్వానం అందింది. 

1 Min read
Mahesh Rajamoni
Published : Jan 17 2024, 03:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

Ayodhya Ram Mandir Pran Pratishtha: జనవరి 22న రామ మందిరాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఇప్పటికే వేలాది మంది ప్రముఖులను ఆహ్వానించారు. క్రికెటర్లు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలకు కూడా ఆహ్వానం అందింది.

28

అఫ్గానిస్థాన్ తో టీ20 సిరీస్ తో బిజీగా ఉన్న విరాట్ కోహ్లీ తన బిజీ షెడ్యూల్ మధ్య రామ మందిర ఆహ్వానాన్ని అంగీకరించాడు. విరాట్-అనుష్క దంప‌తుల‌కు ఆహ్వానం అందిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

38

ఇండోర్ వేదికగా జరిగిన రెండో టీ20లో విజయం సాధించిన టీమిండియా మూడో టీ20 కోసం నేరుగా బెంగళూరుకు బయలుదేరింది. కానీ విరాట్ కోహ్లీ మాత్రం ముంబై వెళ్లాడు.

48
Virat Kohli Anushka Sharma In Rishikesh Ashram

Virat Kohli Anushka Sharma In Rishikesh Ashram

అయోధ్యలో రామ మందిరానికి సంబంధించిన ఆహ్వానాన్ని స్వీకరించడానికి విరాట్ కోహ్లీ ఇండోర్ నుండి ముంబైకి తిరిగి వచ్చాడ‌ని సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానం అందుకునేందుకు కోహ్లీ ముంబైకి తిరిగి వచ్చాడు.

58

ముంబైలోని తమ నివాసంలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలకు రామ మందిరానికి ఆహ్వానం అందింది. ముంబై నుంచి కోహ్లీ నేరుగా బెంగళూరుకు పయనమవుతాడనీ, ఆఫ్ఘానిస్తాన్ తో జ‌రిగే మూడో టీ20లో పాల్గొంటాడ‌ని టీమిండియా వ‌ర్గాలు తెలిపాయి. 

68

కోహ్లీ-అనుష్క దంప‌తుల‌కు ముందు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ దంప‌తుల‌కు కూడా రామ మందిర ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానించారు. రాంచీలోని తన నివాసంలో ధోనీ ఈ ఆహ్వానాన్ని స్వీకరించాడు.

78

క్రికెటర్లలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, ఆయన కుటుంబ సభ్యులను కూడా రామ మందిర ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానించారు. జనవరి 22న సచిన్ తన కుటుంబంతో కలిసి అయోధ్యకు వెళ్లనున్నారు.

88
Venkatesh Prasad

Venkatesh Prasad

కర్ణాటకకు చెందిన మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ కూడా రామ మందిర ప్రతిష్ఠాపన ఆహ్వానాన్ని అందుకున్నాడురు. ఈ నెల 22న అయోధ్యకు వెళ్తానని వెంకటేశ్ ప్రసాద్ తెలిపారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
ఎం.ఎస్. ధోని
క్రీడలు
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved