నెట్ ప్రాక్టీస్ మొదలెట్టిన టీమిండియా... క్రైమ్ పార్టనర్తో మహ్మద్ సిరాజ్...
ఆరు రోజుల క్వారంటైన్ పూర్తిచేసుకున్న టీమిండియా... ఇంగ్లాండ్ సిరీస్ ఆరంభానికి ముందు నెట్ ప్రాక్టీస్ మొదలుపెట్టింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం క్రికెట్ స్టేడియంలో సోమవారం నుంచి ప్రాక్టీస్ మొదలెట్టారు భారత క్రికెట్ జట్టు సభ్యులు. ఫిబ్రవరి 5 నుంచి ఇంగ్లాండ్తో ప్రారంభమయ్యే టెస్టు సిరీస్లో హాట్ ఫెవరెట్గా బరిలో దిగుతోంది భారత జట్టు.
కెరీర్ టర్నింగ్ ఆస్ట్రేలియా టూర్ తర్వాత స్వదేశంలో ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కి సిద్ధమవుతున్నాడు హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్....
ఆస్ట్రేలియా టూర్లో 13 వికెట్లు తీసిన మహ్మద్ సిరాజ్, అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా రికార్డు క్రియేట్ చేశాడు...
మొదటి రెండు టెస్టులకు స్టాండ్బై ప్లేయర్గా ఎంపికైన షాబజ్ నదీమ్తో కలిసి దిగిన ఫోటోను పోస్టు చేసిన సిరాజ్... ‘పార్టనర్ ఇన్ క్రైమ్’ అంటూ కాప్షన్ పెట్టాడు..
సిరాజ్ దేశవాళీ టోర్నీల్లో హైదరాబాద్ ప్లేయర్ కాగా, నదీమ్ జార్ఖండ్కి ఆడతాడు.. ఐపీఎల్లో నదీమ్ సన్రైజర్స్కి ఆడుతుంటే, సిరాజ్ ఆర్సీబీ ఆడుతున్న విషయం తెలిసిందే...
2018 అక్టోబర్లో సౌతాఫ్రికాతో ఒకే టెస్టు మ్యాచ్ ఆడిన షాబజ్ నదీమ్... 4 వికెట్లు పడగొట్టాడు. 17 ఓవర్లు బౌలింగ్ చేసి 18 పరుగులు మాత్రమే ఇచ్చినా, నదీమ్కి మరో అవకాశం దక్కలేదు...
ఏంఏ చిదంబరం స్టేడియంలో టీమిండియా ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాలు... ప్రాక్టీస్ సెషన్లో భారత జట్టు...
ప్రాక్టీస్ మధ్యలో అక్షర్ పటేల్, బుమ్రా చర్చలు...
కుర్రాళ్లకు కూర్చొని సలహాలు ఇస్తున్న రోహిత్ శర్మ...
వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్...
సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ...
భారత సారథి విరాట్ కోహ్లీ...