టీ 20 వరల్డ్ కప్.. ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడో తెలుసా?
T20 World cup: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. మెన్స్ టీ20 వరల్డ్ కప్కి సంబంధించి కీలక ప్రకటన వచ్చేసింది. వచ్చే ఏడాది జరగనున్న ఈ సిరీస్ షెడ్యూల్ను విడుదల చేశారు. కాగా అందరి దృష్టి ఈ టోర్నీలో జరిగే ఇండియా, పాక్ మ్యాచ్పై పడింది.

ఇండియా–పాకిస్తాన్ మ్యాచ్
2026 మెన్స్ T20 వరల్డ్ కప్ లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 15, 2026 న కోలంబోలో జరగనుంది. ఇది ఈ టోర్నమెంట్లో అత్యంత ఆసక్తికర మ్యాచ్ గా భావిస్తున్నారు. ఈ మ్యాచ్ R. ప్రేమదాస స్టేడియంలో నిర్వహించనున్నారు.
భారత్ గ్రూప్లో USA, నెదర్లాండ్స్, నమీబియా కూడా
ఈ టోర్నమెంట్లో భారత్, పాకిస్తాన్తో పాటు USA, నమీబియా, నెదర్లాండ్స్ ఒకే గ్రూప్లో ఉన్నాయి. గ్రూప్ మ్యాచ్లు ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమవుతాయి.
భారత్ మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..
* ఫిబ్రవరి 7: భారత్ వర్సెస్ USA (ముంబై)
* ఫిబ్రవరి 12: భారత్ వర్సెస్ నమీబియా (ఢిల్లీ)
* ఫిబ్రవరి 15: భారత్ వర్సెస్ పాకిస్తాన్ (కోలంబో)
* ఫిబ్రవరి 18: భారత్ వర్సెస్ నెదర్లాండ్స్ (అహ్మదాబాద్)
గ్రూప్ స్టేజ్లో రోజుకి మూడు మ్యాచ్లు జరుగుతాయి.
టోర్నమెంట్ ఫార్మాట్ ఎలా ఉంటుంది?
ఈ T20 వరల్డ్ కప్ను భారత్, శ్రీలంక కలిసి నిర్వహిస్తున్నాయి. టోర్నమెంట్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8, 2026 వరకు జరుగుతుంది.
20 జట్లు → 5 గ్రూపులు
ప్రతి గ్రూప్ నుంచి 2 జట్లు → Super 8 కు అర్హత
Super 8 → 2 గ్రూపులు
టాప్ 2 జట్లు → సెమీ ఫైనల్స్
గెలిచిన జట్లు → ఫైనల్
పాకిస్తాన్ జట్టు అన్ని మ్యాచ్లను శ్రీలంకలోని కోలంబో లేదా కాండీలోనే ఆడుతుంది.
భారత్ సూపర్8కి చేరితే మ్యాచ్లు ఎక్కడ.?
భారత్ Super 8 కి చేరితే మ్యాచ్లు అహ్మదాబాద్, చెన్నై, కొలకతాలో నిర్వహిస్తారు. ఇక సెమీ ఫైనల్ ముంబైలో జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్లో జరుగుతుంది. ఒకవేళ పాకిస్థాన్ ఫైనల్కు వెళ్తే మ్యాచ్ కొలంబోలో నిర్వహిస్తారు.
పాల్గొనే జట్లు & డిఫెండింగ్ ఛాంపియన్
హోస్ట్ దేశాలైన భారత్, శ్రీలంక తో పాటు మొత్తం 20 దేశాలు ఆడుతున్నాయి. అఫ్గానిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, USA, వెస్టిండీస్, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్, కెనడా, ఇటలీ, నెదర్లాండ్స్, నమీబియా, జింబాబ్వే, నేపాల్, ఒమాన్, UAE ఈ సిరీస్లో ఆడనున్నాయి. కాగా భారత్ 2024 T20 వరల్డ్ కప్ చాంపియన్, ఆ సమయంలో ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించిన విషయం తెలిసిందే.

