ముంబై కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్... అర్జున్ టెండూల్కర్కి దక్కని చోటు...
సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 ట్రోఫీలో ముంబై జట్టుకి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా వ్యవహారించబోతున్నాడు. ప్రాక్టీస్ మ్యాచుల్లో తేలిపోయిన కారణంగా సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్కి సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో చోటు దక్కలేదు. జయ్దేవ్ ఉనద్కడ్ సౌరాష్ట్ర జట్టుకి, కరణ్ నాయర్ కర్ణాటక జట్లకి కెప్టెన్లుగా వ్యవహారించబోతున్నారు.
సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీకి జట్టును ప్రకటించే ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచుల్లో పెద్దగా పర్ఫామ్ చేయలేకపోయాడు అర్జున్ టెండూల్కర్...
మూడు మ్యాచుల్లో నాలుగు వికెట్లు తీసి... బ్యాటింగ్లో 7 పరుగులు మాత్రమే చేయగలిగాడు అర్జున్ టెండూల్కర్. అర్జున్ బౌలింగ్లో సూర్యకుమార్ యాదవ్ భారీగా పరుగులు రాబట్టాడు.
ప్రాక్టీస్ మ్యాచుల్లో సత్తా చాటి 164 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్ ముంబై జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆదిత్య తారే ముంబైకి వైస్ కెప్టెన్గా వ్యవహారించబోతున్నాడు.
ముంబై జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), ఆదిత్య తారే (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అకర్షిత్ గోమల్, సర్ఫరాజ్ ఖాన్, సిద్దేశ్ లాడ్, శివమ్ దూబే, శుభమ్ రంజని, సుజిత్ నాయక్, సైరాజ్ పాటిల్, తుషార్ దేశ్పాండే, దవళ్ కుల్కర్ణి, మినాద్ మంజ్రేకర్, ప్రథమేశ్ దాకే, అధర్వ అక్నోకర్, సుశాంక్ అతార్డే, షామ్స్ ములాని, హార్ధిక్ తమోరి, ఆకాశ్ పర్కార్, సుఫియాన్ షేక్
ఢిల్లీ జట్టులో భారత సీనియర్ క్రికెటర్లు శిఖర్ ధావన్, పేసర్ ఇషాంత్ శర్మ ఆడబోతున్నారు. శిఖర్ ధావన్ ఢిల్లీకి కెప్టెన్గా వ్యవహారించబోతున్నాడు.
ఉన్ముక్త్ చంద్, నితీశ్ రాణా, పవన్ సుయల్, మనన్ శర్మ వంటి ప్లేయర్లకు జంబో టీమ్లో చోటు కల్పించింది ఢిల్లీ.
సౌరాష్ట్ర జట్టుకి జయ్దేవ్ ఉనద్కడ్ కెప్టెన్గా వ్యవహారించబోతున్నాడు. రంజీ ట్రోఫీని గెలిచిన జయదేవ్నే సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీకి కూడా కెప్టెన్గా ఎంచుకుంది సౌరాష్ట్ర.
సౌరాష్ట్ర జట్టు: జయ్దేవ్ ఉనద్కడ్ (కెప్టెన్), చిరాగ్ జని, ధర్మేంద్రసిన్ జడేజా, అవి బరోట్, హర్విక్ దేశాయ్, అర్పిత్ వసవాడ, సమర్త్ వాస్, విశ్వరాజ్సిన్ జడేజా, చేతన్ సకారియా, పేరక్ మన్యాడ్, దివ్యరాజ్సిన్ చౌహన్, వండిత్ జివ్రాజని, పార్థ్ బుట్, అగ్నివేశ్ అయాచి, కునాల్ కరమ్చందని, యువరాజ్ చుడసమా, హిమాలయ్ బరాడ్, కుషంగ్ పటేల్, పార్థ్ చౌహన్, దేవాంగ్ కరమట
టెస్టుల్లో త్రిబుల్ సెంచరీ చేసిన భారత రెండో క్రికెటర్ కరణ్ నాయర్... కర్ణాటక జట్టుకి కెప్టెన్గా వ్యవహారించబోతున్నాడు...
కర్ణాటక జట్టు ఇది: కరణ్ నాయర్ (కెప్టెన్), పవన్ దేశ్పాండే (వైస్ కెప్టెన్), దేవ్దత్ పడిక్కల్, రోహన్ కదమ్, కేవీ సిద్ధార్థ్, కెఎల్ శ్రీజిత్, బీఆర్ శరత్, అనిరుథ్ జోషి, శ్రేయాస్ గోపాల్, కృష్ణప్ప గౌతమ్, జగదీశ్ సుచిత్, ప్రవీణ్ దూబే, అభిమన్యు మిథున్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రతీక్ జైన్, వీ కౌషిక్, రోహిత్ మోరే, దర్శన్, మనోజ్ భండాగే, శుభాంగ్ హెగ్దే