టీమిండియా కెప్టెన్గా స్మృతి మంధాన... త్వరలోనే కెప్టెన్సీ మార్పు ఉంటుందన్న కోచ్...
భారత మహిళా జట్టులోకి ఓ సంచలనంలా ఎంట్రీ ఇచ్చింది స్మృతి మంధాన. అందంతో యూత్లో ఫాలోయింగ్ తెచ్చుకుని, అంతకుమించిన ఆటతో క్రేజ్ పెంచుకుంది...
టీమిండియాలో స్టార్ ప్లేయర్గా మారిన స్మృతి మంధాన త్వరలోనే కెప్టెన్గా బాధ్యతలు తీసుకుంటుందని అంటున్నాడు భారత మహిళా జట్టు హెడ్ కోచ్ రమేశ్ పవార్...
సౌతాఫ్రికా టూర్లో బ్యాటింగ్తో ఆకట్టుకున్న స్మృతి మంధాన, ఆస్ట్రేలియా టూర్లో బ్యాటింగ్ భారాన్నంతా ఒంటిచేత్తో మోసింది...
రెండో వన్డే మ్యాచ్లో 86 పరుగులు చేసిన 25 ఏళ్ల స్మృతి మంధాన, పింక్ బాల్ టెస్టు మ్యాచ్లో 127 పరుగులు చేసి భారత జట్టుకి భారీ స్కోరు అందించింది...
టీ20ల్లోనూ ఆకట్టుకునే పర్ఫామెన్స్ ఇచ్చిన స్మృతి మంధాన, ఆఖరి టీ20 మ్యాచ్లో 52 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేసింది... మొత్తంగా ఈ టూర్లో 340+ పరుగులు చేసి టీమిండియా తరుపున టాప్ స్కోరర్గా నిలిచింది...
‘స్మృతిలో ఓ లీడర్ ఉంది. ఆమెను జట్టును నడిపించగల సత్తా ఉన్న ప్లేయర్గా చూస్తున్నాం. జట్టులోని మిగిలిన యంగ్ ప్లేయర్లను ఆమె తన ఆటతో ఇన్స్పైర్ చేస్తోంది...
తన ఆటతీరు అద్భుతం. పింక్ బాల్ టెస్టుల్లో ఆమె చేసిన సెంచరీ చాలా గొప్పది. తను ఓ డిఫెరెంట్ ప్లేయర్. వరల్డ్లో చాలా లీగుల్లో ఆడుతూ చాలా అనుభవం సంపాదిస్తోంది...
టీమిండియాకి ఓ విలువైన ప్లేయర్గా మారింది స్మృతి మంధాన. వరల్డ్కప్ గెలవాలంటే తనలాంటి ప్లేయర్లు కావాలి...’ అంటూ కామెంట్ చేశాడు రమేశ్ పవార్...