MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • సఫారీ సిరీస్‌కు సారథిగా గబ్బర్.. టీ20 ప్రపంచకప్ సభ్యులందరికీ రెస్ట్

సఫారీ సిరీస్‌కు సారథిగా గబ్బర్.. టీ20 ప్రపంచకప్ సభ్యులందరికీ రెస్ట్

INDIA vs SOUTH AFRICA: త్వరలో భారత పర్యటనకు రానున్న   దక్షిణాఫ్రికా భారత్ తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. టీ20 సిరీస్ కు రోహిత్ శర్మ సారథి కాగా వన్డేలకు మాత్రం.. 

2 Min read
Author : Srinivas M
Published : Sep 12 2022, 09:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈ ఏడాది జూన్ లో ఇదివరకే భారత పర్యటనకు వచ్చిన  దక్షిణాఫ్రికా.. తాజాగా మళ్లీ రెండోసారి కూడా  రాబోతున్నది.  ఈ నెల ఆఖర్లో భారత పర్యటనకు వచ్చే  దక్షిణాఫ్రికా.. భారత్ తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది.  ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారైంది.  

26
Image credit: Getty

Image credit: Getty

అయితే టీ20 ప్రపంచకప్ కు ముందు జరుగుతున్న సిరీస్ కావడంతో ఈ సిరీస్ కు  భారత సెలక్టర్లు  ముందస్తు  ప్రణాళికలు సిద్ధం చేశారు. టీ20 జట్టుకు రోహిత్ శర్మనే సారథిగా వ్యవహరించినా వన్డే సిరీసీ కు మాత్రం శిఖర్ ధావన్ కెప్టెన్ గా ఉండనున్నాడు.

36

ఈ మేరకు సెలక్టర్లు కూడా జట్టును ఎంపిక చేసే పనిలో పడ్డారు. రోహిత్ తో పాటు టీ20 ప్రపంచకప్ కు వెళ్లబోయే పలువురు క్రికెటర్లకు ఈ సిరీస్ లో రెస్ట్ ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నారు.  వారిలో రోహిత్ తో పాటు విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా, కెఎల్ రాహుల్ కూడా  విరామం తీసుకునే ఛాన్స్ ఉంది. 

46

దక్షిణాఫ్రికా కంటే  ముందు భారత్.. ఆస్ట్రేలియాతో మూడు టీ20లు ఆడుతుంది. సెప్టెంబర్ 20, 23, 25 వ తేదీలలో ఈమ్యాచులు జరుగుతాయి.  ఈ సిరీస్ కు రోహిత్ శర్మనే సారథిగా వ్యవహరించనున్నాడు.

56

ఈ సిరీస్ తర్వాత దక్షిణాఫ్రికా.. భారత పర్యటనకు రానుంది.ఈ సిరీస్ లో భాగంగా సఫారీలు భారత్ తో మొదలు  మూడు టీ20లుఆడతారు.  సెప్టెంబర్ 28, అక్టోబర్ 2, అక్టోబర్4న మూడుటీ20లు జరుగుతాయి. ఆ తర్వాత దక్షిణాఫ్రికా.. అక్టోబర్  6, 9, 11 తేదీలలో మూడు వన్డేలను ఆడనుంది.   

66

కాగా టీ20 సిరీస్ కు రోహిత్ శర్మనే సారథిగా  వ్యవహరించనుండగా.. వన్డేలకు మాత్రం  శిఖర్ ధావన్ కెప్టెన్ గా ఉండనున్నాడు. అయితే టీ20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా వెళ్లనున్న టీమిండియా.. అదే నెల 9 లేదా 10న  మెల్బోర్న్ విమానం ఎక్కనుంది. దీంతో వన్డే సిరీస్ కు  వెస్టిండీస్, జింబాబ్వే సిరీస్ ల మాదిరిగా రెండో శ్రేణి జట్టును ఆడించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని బోర్డు వర్గాల టాక్. ఇక ఈ సిరీస్ కు ద్రావిడ్ కాకుండా వీవీఎస్ లక్ష్మణ్ టీమిండియా కు హెడ్ కోచ్ గా వ్యవహరించనున్నాడు. 
 

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026 : వెళుతూ వెళుతూ ఆల్ టైమ్ రికార్డు బద్దలుగొట్టిన ఆసిస్.. అదేంటో తెలుసా?
Recommended image2
అండర్ డాగ్స్‌గా సూపర్ 8కి.. పిల్లబచ్చా అనుకుంటే అంచనాలు తలకిందులే..
Recommended image3
అది కోహ్లీకే సాధ్యం.. టీమిండియా రన్ మెషిన్‌ను ఆకాశానికి ఎత్తేసిన కమ్మిన్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved