వ్యాక్సిన్ వేయించుకున్న శిఖర్ ధావన్... అందరిచూపు గ్లవ్స్, ఆ డాక్టర్పైనే...
భారత క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్... కరోనా వ్యాక్సిన్ చేయించుకున్నాడు. సోషల్ మీడియా ద్వారా తాను వ్యాక్సిన్ వేయించుకుంటున్న ఫోటోను షేర్ చేసిన ‘గబ్బర్’... ఫ్రంట్లైన్ వారియర్స్కి ధన్యవాదాలు తెలిపాడు...
‘వ్యాక్సిన్ చేయించుకున్నా... త్యాగం, అంకితభావంతో కరోనా నియంత్రణ కోసం కృషి చేస్తున్న మన ఫ్రంట్లైన్ వారియర్స్కి ధన్యవాదాలు తెలియచేస్తున్నా. మీరు వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఏ మాత్రం భయపడకండి. వైరస్ను చంపడానికి ఇది ఉపయోగపడుతుంది’ అంటూ ట్వీట్ చేశాడు శిఖర్ ధావన్.
అయితే ‘గబ్బర్’ పోస్టు చేసిన ఫోటోలో అతను ధరించిన చేతి గ్లవ్ చిరిగిపోయి ఉంది. దీంతో శిఖర్ ధావన్ని ట్రోల్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. వ్యాక్సిన్ వేయించుకున్నంత మాత్రాన చిరిగిన గ్లవ్స్ ధరించాలని లేదంటూ కామెంట్లు పెడుతున్నారు.
మరికొందరైతే వ్యాక్సిన్ చేస్తున్న లేడీ డాక్టర్ చాలా అందంగా ఉందని, ఆమె ఎవరో చెప్పాలంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంత అందమైన డాక్టర్ ఉంటే ఎన్నిసార్లైనా వ్యాక్సిన్ చేయించుకున్నామని కామెంట్లు చేస్తున్నారు కొందరు కొంటె నెటిజన్లు.
కరోనా వ్యాక్సిన్ చేయించుకోవాలని ఓ మంచి సందేశం ఇవ్వాలని చూసిన ‘గబ్బర్’ శిఖర్ ధావన్... నెటిజన్ల వింత వైఖరికి ఆశ్చర్యపోతున్నాడు...
ఐపీఎల్ 2020 సీజన్లో ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్థానంలో నిలిచిన శిఖర్ ధావన్, 2021 సీజన్ అర్ధాంతరంగా నిలిపివేసే సమయానికి 8 మ్యాచుల్లో 380 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా టాప్లో ఉన్నాడు.
యంగ్ ఓపెనర్ పృథ్వీషాతో కలిసి అదిరిపోయే భాగస్వామ్యాలు నెలకొల్పిన శిఖర్ దావన్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పాయింట్ల పట్టికలో టాప్లో ఉండడానికి కారణమయ్యాడు.
8 మ్యాచుల్లో 6 విజయాలు అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్, సీజన్ నిలిపివేసే సమయానికి పాయింట్ల పట్టికలో టాప్లో ఉండగా సీఎస్కే రెండో స్థానంలో, ఆర్సీబీ మూడో స్థానంలో ఉన్నాయి.