శిఖర్ ధావన్ ఆడలేకపోతే, విరాట్ కోహ్లీ దిగుతాడు... ‘గబ్బర్’ ఆ విషయం గుర్తుపెట్టుకొని ఆడు...
ఇప్పుడు టీమిండియాలో ఒక్కో ప్లేస్కి విపరీతమైన పోటీ నెలకొని ఉంది. రిజర్వు బెంచ్ పటిష్టంగా మారడంతో అవకాశాలు కోసం పోటీపడాల్సిన పరిస్థితి. దీంతో లంక టూర్లో శిఖర్ ధావన్ తన ప్రతాపం చూపించాలని అంటున్నాడు మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్...
‘టీ20 వరల్డ్కప్కి ముందు శ్రీలంక పర్యటనలో కెప్టెన్సీ దక్కడం శిఖర్ ధావన్ అదృష్టం. ఎందుకంటే ఈ టూర్లో ధావన్ పర్పామెన్స్, అతని ఫ్యూచర్ని డిసైడ్ చేయబోతోంది...
ఇప్పటికే టీమిండియాలో రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేయడానికి చాలామంది ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కెఎల్ రాహుల్, ఆ ప్లేస్కి తానే కరెక్ట్ అని నిరూపించుకున్నాడు...
అదీకాకుండా విరాట్ కోహ్లీ కూడా టీ20ల్లో ఓపెనింగ్ చేస్తానని ప్రకటించాడు. ఇప్పుడు శ్రీలంక టూర్లో శిఖర్ ధావన్, అంచనాలకు మించి ఆడకపోతే... అతని స్థానంలో ఓపెనర్గా కోహ్లీ దిగడం గ్యారెంటీ...
అతను మిగిలిన ప్లేయర్ల కంటే ఎక్కువ పరుగులు చేయాలి. అవసరమైన మూడు టీ20 మ్యాచుల్లో కనీసం ఓ సెంచరీ చేస్తే బెటర్... మూడు మ్యాచుల్లోనూ రాణిస్తే, రోహిత్తో కలిసి టీ20 వరల్డ్కప్లో ఓపెనింగ్ చేసే అవకాశం దక్కొచ్చు’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్...
ఒకప్పుడు రోహిత్ శర్మతో కలిసి వన్డేలు, టీ20ల్లో ఓపెనింగ్ చేసిన శిఖర్ ధావన్... వన్డేల్లో ఓపెనర్గా కొనసాగుతున్నా, టీ20ల్లో మాత్రం అతనికి తుదిజట్టులో చోటు దక్కడం లేదు...
వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా రాణిస్తున్న కెఎల్ రాహుల్ను ఓపెనింగ్ చేయిస్తూ వచ్చింది టీమిండియా. అయితే ఇంగ్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో అతనూ విఫలం కావడంతో ఆఖరి మ్యాచ్లో ఓపెనర్గా వచ్చాడు విరాట్ కోహ్లీ...
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కలిసి ఓపెనింగ్ చేసి భారత జట్టుకి భారీ స్కోరు అందించారు. తొలి వికెట్కి హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీ, హాఫ్ సెంచరీలతో మోత మోగించి టీమిండియాకి విజయాన్ని అందించారు.
ఈ మ్యాచ్ తర్వాత టీ20ల్లో ఓపెనింగ్ చేయబోతున్నట్టు ప్రకటించాడు విరాట్ కోహ్లీ. చెప్పినట్టుగానే ఐపీఎల్ 2021 సీజన్లో ఓపెనర్గా వచ్చాడు...
ఒకప్పుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో పాటు సమానంగా స్టార్డమ్ అనుభవించిన శిఖర్ ధావన్ గాయాలు, ఫామ్ కారణంగా తుదిజట్టులో స్థానం కోసం పోటీపడాల్సిన పరిస్థితి తెచ్చుకోవడం విశేషం...
ఇప్పుడు శిఖర్ ధావన్కి టీ20 వరల్డ్కప్ జట్టులో చోటు దక్కాలంటే శ్రీలంక టూర్ కీలకం కానుంది. ఇప్పటికే గత రెండు ఐపీఎల్ సీజన్లలో అదరగొడుతున్న ధావన్, లంక టూర్లోనూ రాణిస్తే... వరల్డ్కప్లో ఓపెనింగ్ చేయడం పక్కా...