నాన్న చనిపోయినప్పుడే ఆ నిర్ణయం తీసుకున్నా... స్టీవ్ స్మిత్తో విరాట్ కోహ్లీ...
భారత క్రికెటర్లకి ఇక్కడ ఫాలోయింగ్ ఉండడం మామూలే. కానీ ఓ ఇండియన్ క్రికెటర్కి ఆస్ట్రేలియాలో బీభత్సమైన ఫాలోయింగ్, క్రేజ్ ఉందంటే... అది అసాధారణం. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఆడే అన్ని దేశాల్లో విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. ప్రస్తుతం ఆసీస్ టూర్లో ఉన్న విరాట్ కోహ్లీ, అక్కడ వీఐపీ సేవలను పొందుతున్నాడు. ఆస్ట్రేలియా జనాలతో పాటు అక్కడి మీడియా కూడా ‘కింగ్’ కోహ్లీని ఆకాశానికి ఎత్తుతోంది...
విరాట్ కోహ్లీ మొదటి టెస్టు ముగిసిన తర్వాత స్వదేశానికి వెళ్లిపోతుండడంతో తమకు దాదాపు రూ.7 కోట్ల నష్టం వస్తోందని సంచలన విషయాన్ని ప్రకటించింది ఆసీస్ టాప్ మీడియా ఛానెల్ 7...
కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్ కారణంగా మ్యాచ్ వీక్షించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని, విరాట్ వెళ్లిపోతే టెస్టులను చూడడానికి ఆస్ట్రేలియా జనాలు పెద్దగా ఇష్టపడరని కూడా తేల్చిసిందీ ఛానెల్...
టీ20, వన్డే, టెస్టు... ఇలా అన్ని ఫార్మాట్లలోనూ పరుగుల వరద పారిస్తున్న విరాట్ కోహ్లీ... టెస్టుల్లో ఆసీస్ ప్లేయర్ స్టీవ్ స్మిత్తో కలిసి టాప్ ప్లేస్ కోసం పోటీపడుతున్నాడు...
ఆస్ట్రేలియాలో విరాట్కి ఉన్న ఫాలోయింగ్ను దృష్టిలో పెట్టుకుని ఆసీస్ స్టార్ బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్తో కోహ్లీని ఇంటర్వ్యూ చేయించింది క్రికెట్ ఆస్ట్రేలియా...
ఇద్దరు దిగ్గజ క్రికెటర్ల మధ్య జరిగిన ఈ ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెట్టాడు భారత సారథి విరాట్ కోహ్లీ...
‘నేను మొదటిసారి క్రికెట్ ఆడింది మా నాన్న ప్రేమ్ కోహ్లీతోనే... ఆయనే నాకు బౌలింగ్ చేసేవాడు. ప్లాస్టిక్ బ్యాటుతో బ్యాటింగ్ చేస్తుంటే మా నాన్న నన్ను చూసి మురిసిపోయేవారు...
నాన్న చనిపోయాక ఒక్కసారి నా జీవితం బ్లాక్ అయిపోయిందని అనిపించింది... అప్పుడు నాకున్న ఒకే ఒక్క వ్యాపకం క్రికెట్.. అందుకే నాన్న మరణం తర్వాత క్రికెట్ను చాలా సీరియస్గా తీసుకున్నా...
క్రికెట్ను కెరీర్గా ఎంచుకుంది కూడా అప్పుడే... ’ అని తన తండ్రితో ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ...
పెటర్నిటీ లీవ్ మీద మొదటి టెస్టు ముగిసిన తర్వాత స్వదేశానికి తిరిగి రానున్నాడు విరాట్ కోహ్లీ... దీనిపై అనేక మంది అనేక రకాలుగా కామెంట్ చేస్తున్నారు...
అయితే ఏవరేం అనుకున్నా తాను పట్టించుకోనని చెప్పిన విరాట్ కోహ్లీ... దేశం తరుపున ఆడడానికి ఎంత కట్టుబడి ఉన్నానో, కుటుంబానికి అండగా నిలవడానికి కూడా అంతే నిబద్ధతతో వ్యవహారిస్తానని చెప్పాడు...
‘మొదటిసారి తండ్రి కావడం అనేది మాటల్లో చెప్పలేని అనుభూతి. దాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోవాలని అనుకోవడం లేదు. అందుకే ఇండియాకి తిరిగి వెళ్లాలని డిసైడ్ అయ్యాను...’ అంటూ చెప్పాడు విరాట్ కోహ్లీ...