RRvsKXIP: మయాంక్, కెఎల్ రాహుల్... ‘కింగ్స్’ బ్రేక్ చేసిన రికార్డులివే!
IPL 2020 సీజన్లో బీభత్సమైన ఫామ్లో ఉన్నారు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓపెనర్లు కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో మొదటి వికెట్కి 183 పరుగులు జోడించిన ఈ జోడి పలు రికార్డులను క్రియేట్ చేశారు.
రాజస్థాన్ రాయల్స్పై ఏ వికెట్కైనా రాహుల్, మయాంక్ జోడించిన 183 పరుగుల భాగస్వామ్యమే అత్యధికం...
ఇంతకుముందు రాజస్థాన్పై ముంబై ప్లేయర్లు సచిన్ టెండూల్కర్, స్మిత్ కలిసి చేసిన 163 పరుగలే అత్యధిక భాగస్వామ్యం...
మురళీ విజయ్ తర్వాత రాజస్థాన్ రాయల్స్పై సెంచరీ చేసిన భారత క్రికెటర్ మయాంక్ అగర్వాల్...
ఆండ్రూ సైమండ్స్, షాన్ మార్ష్, మురళీ విజయ్, షేన్ వాట్సన్ తర్వాత ఆర్ఆర్పై సెంచరీ చేసిన బ్యాట్స్మెన్ మయాంక్ అగర్వాల్...
యూసఫ్ పఠాన్ తర్వాత అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత క్రికెటర్ మయాంక్ అగర్వాల్...
యూసఫ్ పఠాన్ 37 బంతుల్లో సెంచరీ బాదగా, మయాంక్ అగర్వాల్ 45 బంతుల్లో సెంచరీ చేశాడు.
ఈ సీజన్లో మొదటి రెండు సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ భారతీయులే. ఇంతకుముందు వాల్తెటీ, సచిన్ 2011లో సెంచరీ చేశారు.
మయాంక్, రాహుల్ జోడించిన 183 పరుగులు, ఐపీఎల్లో మూడో అత్యధిక భాగస్వామ్యం...
డేవిడ్ వార్నర్- బెయిర్స్టో 185 పరుగులు, గంభీర్- క్రిస్లీన్ 184 రికార్డులకు 3 పరుగుల దూరంలో ఆగిపోయారు మయాంక్, కెఎల్ రాహుల్.
రాజస్థాన్ రాయల్స్పై చెన్నై సూపర్ కింగ్స్ చేసిన 246/5 పరుగుల తర్వాత పంజాబ్ నేడు చేసిన స్కోరే అత్యధికం.
రంజీ ట్రోఫీలో త్రిబుల్ సెంచరీ, విజయ్ హాజరే ట్రోఫీలో 150+, సయ్యద్ ముస్తక్ ఆలీ ట్రోఫీ, ఐపీఎల్ టోర్నీల్లో సెంచరీ చేసిన మొట్టమొదటి క్రికెటర్ మయాంక్ అగర్వాల్.
ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు ఉన్న జట్టుగా ఆర్సీబీతో కలిసి టాప్లో నిలిచింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల బ్యాట్స్మెన్ 13 సార్లు సెంచరీలు చేశారు.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్లో కొట్టిన 11 సిక్సర్లతో కలిపి ఐపీఎల్లో పంజాబ్ సిక్సర్ల సంఖ్య 999కి చేరింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (1137 సిక్సర్లు), ముంబై ఇండియన్స్ (1108) మాత్రమే పంజాబ్ కంటే ముందున్నాయి.