రోహిత్ బెస్ట్ కెప్టెన్ కాదు, బెస్ట్ టీమ్కి కెప్టెన్ మాత్రమే... వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్...
IPL 2020 సీజన్లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... ఎలిమినేటర్ మ్యాచ్లో ఓడి టోర్నీ నుంచి నిష్కమించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్, మరోసారి ఫైనల్కి దూసుకెళ్లడంతో బెస్ట్ కెప్టెన్ ఎవరనే చర్చ మొదలైంది. ఈ విషయంలో చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చాడు భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.
ఎనిమిది సీజన్లుగా జట్టుకి టైటిల్ అందించలేకపోయిన విరాట్ కోహ్లీ, కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలంటూ డిమాండ్ చేశాడు కేకేఆర్ మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్.
ఇన్ని సీజన్లు ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోతే, మరే జట్టు కూడా కెప్టెన్ను కొనసాగించదని... కోహ్లీపై విమర్శల వర్షం కురిపించాడు గౌతీ...
ఆర్సీబీ వరుసగా ఫెయిల్ అవుతూ ఉండడంతో విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి తొలగించాలనే డిమాండ్ కూడా వినిపిస్తున్నారు క్రికెట్ అభిమానులు...
దీనిపై తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చాడు భారత లెజెండరీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్. కెప్టెన్ని మార్చినంత మాత్రాన ఆర్సీబీ ఆట ఏ మాత్రం మెరుగుపడదని చెప్పాడు వీరూ.
‘ఆర్సీబీ జట్టులో సమతూకం లేదు. కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్ తప్ప మరో స్టార్ బ్యాట్స్మెన్ లేడు. దేవ్దత్ పడిక్కల్ బాగానే ఆడుతున్నా, పెద్దగా అనుభవం లేదు కాబట్టి భారీ షాట్లు ఆడలేకపోతున్నాడు...
కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్ త్వరగా అవుటైతే ఆర్సీబీ పనైపోయినట్టే... మిడిల్ ఆర్డర్లో సరైన బ్యాట్స్మెన్ లేకుండా టైటిల్ ఎలా గెలవగలరు... ఇలాంటి జట్టుతో ఎవ్వరూ టైటిల్ గెలవలేరు...
ఆర్సీబీ జట్టులో బౌలింగ్ విభాగం కూడా సరిగా లేదు. యార్కర్లతో బ్యాట్స్మెన్ను భయపెట్టే స్టార్ బౌలర్ వారికి లేడు... ’ అంటూ చెప్పుకొచ్చాడు వీరేంద్ర సెహ్వాగ్.
ముంబైకి నాలుగు టైటిల్స్ అందించిన రోహిత్ శర్మను భారత జట్టు కెప్టెన్గా నియమించాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. దీనికి కూడా సమాధానం చెప్పాడు వీరూ...
రోహిత్ శర్మ, డి కాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ వంటి భారీ హిట్టర్లు... పోలార్డ్, హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా వంటి ఆల్రౌండర్లు ఉన్న ముంబైని నడిపించడం ఎవ్వరికైనా చాలా తేలికైన పని అన్నారు వీరూ.
ముంబై వరుసగా టైటిల్స్ గెలుస్తోందని దానికి కారణం రోహిత్ శర్మ కాదు. ఎందుకంటే రోహిత్ శర్మ బెస్ట్ కెప్టెన్ కాదు, బెస్ట్ టీమ్కి కెప్టెన్ మాత్రమే...
రోహిత్ శర్మ డకౌట్ అయినా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 200 పరుగుల భారీ స్కోరు చేసింది ముంబై. ఆర్సీబీలో పరిస్థితి అలా లేదు, కోహ్లీ డకౌట్ అయితే బెంగళూరు భారీ స్కోరు చేయలేదు...
అసలు ఏ మాత్రం సమతూకం లేని జట్టును ప్లేఆఫ్ చేర్చిన విరాట్ కోహ్లీయే బెస్ట్ కెప్టెన్... ఎందుకంటే అతను బ్యాటింగ్తో ఆకట్టుకుంటూ జట్టును ముందుండి నడిపిస్తాడు... అంటూ కోహ్లీకి మద్ధతుగా నిలిచాడు వీరేంద్ర సెహ్వాగ్.
రాయల్ ఛాలెంజర్స్కి, విరాట్ కోహ్లీ ఆటకు తాను కూడా అభిమానినని, అందుకు ఎప్పుడూ గర్వపడుతుంటానని చెప్పుకొచ్చాడు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.