రోహిత్ శర్మ ఆ ఇన్నింగ్స్, జట్టు ఆలోచనని పూర్తిగా మార్చేసింది... విరాట్ కోహ్లీ కామెంట్...
స్వదేశంలో అత్యధిక టెస్టు సిరీస్లో గెలిచిన భారత కెప్టెన్గా, అత్యధిక టెస్టు విజయాలు అందుకున్న భారత సారథిగా తన రికార్డును మరింత పదిలపరుచుకున్నాడు విరాట్ కోహ్లీ. స్వదేశంలో ఇంగ్లాండ్ను 1-3 తేడాతో చిత్తు చేసిన టీమిండియా, ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కి అర్హత సాధించింది...
అంతేకాకుండా ఐసీసీ టెస్టు టీమ్ ర్యాంకింగ్స్లో టాప్ ప్లేస్కి చేరిన టీమిండియా, ఏప్రిల్ 1న ఐసీసీ టెస్టు గదను, రూ.73 లక్షల పారితోషికాన్ని అందుకోబోతోంది. అహ్మదాబాద్ టెస్టు విజయానంతరం మీడియాతో మాట్లాడిన కోహ్లీ, కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు...
‘మొదటి టెస్టు ఓడిన తర్వాత కమ్బ్యాక్ ఇవ్వడం చాలా గొప్ప విషయం. మొదటి టెస్టులో మేం స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోయాం. అదీకాకుండా టాస్ కీలక పాత్ర పోషంచింది...
సిరీస్లో కమ్ బ్యాక్ ఇవ్వాలని కసితో ఆడాం. చెన్నై టెస్టు తొలి ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ చేసిన 160 పరుగులు, 250 పరుగులతో సమానం. ఆ ఇన్నింగ్స్లో జట్టులో నమ్మకాన్ని పెంచింది...
అంతేకాకుండా టాప్ ఆర్డర్లో రోహిత్ శర్మ టీమిండియాకు మంచి సహకారాన్ని అందించాడు. నేటి మ్యాచ్లో రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్ భాగస్వామ్యం చాలా కీలకం. రిజర్వు బెంచ్ ఇంత పటిష్టంగా ఉండడం భారత జట్టు బలం...
ప్రతీ జట్టు ఎంతో నాణ్యమైన ప్లేయర్లతో బరిలో దిగుతోంది. అలాంటి సందర్భాల్లో వారిని ఓడించాలంటే బెస్ట్ పర్ఫామెన్స్ ఇవ్వాలి... స్వదేశంలో అయినా విదేశంలో గెలుపు అంత ఈజీగా రాదు...
రవిచంద్రన్ అశ్విన్ ఎంతో విలువైన ఆటగాడు. కొన్నేళ్లుగా అశ్విన్, రోహిత్ శర్మ భారత జట్టులో కీలక ప్లేయర్లుగా మారారు. అక్షర్ పటేల్, రిషబ్ పంత్ కూడా అద్భుతంగా రాణించారు...
ఇప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్పైన ఫోకస్ పెడతాం... 2020లో మమ్మల్ని ఓడించిన న్యూజిలాండ్తో ఫైనల్ ఆడబోతుండడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది...’ అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ...
‘వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్కి అర్హత సాధించడమే ప్రధాన లక్ష్యంగా బరిలో దిగాం. ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించడం ఓ అద్భుతం. అయితే వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ గెలివడం అంత తేలిక కాదు...
నాకు, అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా లాంటివారికి ఇది వరల్డ్కప్తో సమానం. ఆస్ట్రేలియాలో దక్కిన విజయం కారణంగానేమో మొదటి టెస్టులో అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయాం... రిషబ్ పంత్ అద్భుతంగా ఆడుతుండడం చాలా సంతోషంగా ఉంది.
రిషబ్ పంత్ పర్ఫామెన్స్ను లెజెండరీ ప్లేయర్లతో పోల్చడం సరికాదు. అది అతని పర్ఫామెన్స్పై ప్రభావం చూపుతుంది... జడేజా ప్లేస్లో వచ్చిన అక్షర్ పటేల్ అదరగొట్టాడు. ఇప్పుడు అతనికి దక్కుతున్న పొగడ్తలకు అతను పూర్తిగా అర్హుడు...’ అంటూ వ్యాఖ్యానించాడు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెలిచిన రవిచంద్రన్ అశ్విన్...