రిషబ్ పంత్ దూకుడు... తొలి ఇన్నింగ్స్లో టీమిండియాకు ఆధిక్యం... ఇంగ్లాండ్ అసహనం..
రోహిత్ శర్మ మినహా టాపార్డర్ ఘోరంగా ఫెయిల్ కావడంతో 146 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన టీమిండియాను రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్ కలిసి ఆదుకున్నారు. 78 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయిన టీమిండియా, ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరును సమం చేసి, ఆధిక్యం దిశగా సాగుతోంది..
భారత యంగ్ వికెట్ కీపర్ తన ఫామ్ను కొనసాగిస్తూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో ఏడో హాఫ్ సెంచరీ బాదిన రిషబ్ పంత్, ఈ సిరీస్లో మూడో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు...
ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్తో కలిసి ఏడో వికెట్కి 80+ పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రిషబ్ పంత్, ఇంగ్లాండ్ బౌలర్లను చిరాకు పెడుతూ పరుగులు సాధించాడు...
హాఫ్ సెంచరీ తర్వాత దూకుడు పెంచిన రిషబ్ పంత్, బెన్ స్టోక్స్ బౌలింగ్లో రెండు ఫోర్లు బాదాడు. ఆ తర్వాత జో రూట్ బౌలింగ్లో రెండు వరుస బౌండరీలు సాధించాడు...
మరో ఎండ్లో వాషింగ్టన్ సుందర్ కూడా 77 బంతుల్లో 2 ఫోర్లతో 25 పరుగులు చేసి మంచి భాగస్వామ్యం నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించాడు. ఇద్దరు బ్యాట్స్మెన్ నిలదొక్కుకోవడంతో ఇంగ్లాండ్ బౌలర్లు తీవ్ర అసహనానికి గురయ్యారు.
ముఖ్యంగా సుందర్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బెన్ స్టోక్స్, ఓ ప్రమాదకరమైన భీమర్ వేశారు. అంపైర్, అతనికి వార్నింగ్ కూడా ఇచ్చాడు. గత మ్యాచ్లో 5 వికెట్లు తీసిన జో రూట్, 4 వికెట్లు తీసిన జాక్ లీచ్ బౌలింగ్లో కూడా దూకుడుగా పరుగులు రాబడుతున్నారు పంత్, సుందర్...
144 బంతుల్లో 7 ఫోర్లతో 49 పరుగులు చేసిన రోహిత్ శర్మ, బెన్ స్టోక్స్ బౌలింగ్లో అవుట్ కాగా, అశ్విన్ 32 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసి జాక్ లీచ్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు.
146 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన టీమిండియాకు రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్ కలిసి అమూల్యమైన భాగస్వామ్యాన్ని అందించారు..
మూడో సెషన్లో కొత్త బంతితో బౌలింగ్కి వచ్చిన అండర్సన్ ఓవర్లోనూ వరుసగా రెండు బౌండరీలు రాబట్టాడు రిషబ్ పంత్...