పంత్ పనైపోయింది... అలా చేయకపోతే అతని కెరీర్ ముగిసినట్టే.. . ఆకాశ్ చోప్రా కామెంట్స్
First Published Dec 8, 2020, 4:10 PM IST
భారత జట్టులోకి ఓ సంచలనంలా దూసుకొచ్చాడు రిషబ్ పంత్. సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ఆలోచనలు చేసిన తర్వాత మాహీ ప్లేస్ను భర్తీ చేసే బెస్ట్ ఆప్షన్గా పంత్వైపే చూశారు సెలక్టర్లు. అయితే ఎన్ని అవకాశాలు ఇచ్చినా నిర్లక్ష్యపు ఆటతీరుతో జట్టులో స్థానం కోల్పోయాడు రిషబ్ పంత్. ఆసీస్ టూర్లో వన్డే, టీ20లకు ఎంపిక కాని రిషబ్ పంత్ కేవలం టెస్టు జట్టులో స్థానం దక్కించుకున్నాడు. సాహా ఉండడంతో పంత్ ఆడడం కష్టమే.

హైట్ తక్కువగా ఉండే రిషబ్ పంత్, పరుగులు తీయడంలో చాలా బద్ధకంగా వ్యవహారిస్తాడు... ఎలాంటి బాల్నైనా బౌండరీకి పంపాలనే ఉద్దేశంతో కొన్ని నిర్లక్ష్యపు షాట్స్ ఆడతాడు...

ఈ బద్ధకమే రిషబ్ పంత్పై తీవ్రమైన వ్యతిరేకత రావడానికి కారణమైంది. పంత్కి పోటీగా ఉన్న సంజూ శాంసన్, ఐపీఎల్ 2020 సీజన్లో నాలుగు హాఫ్ సెంచరీలు చేస్తే పంత్ ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేశాడు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?