అలా చూస్తే ‘ఈ సాలా కమ్ నమ్దే’... విరాట్ కోహ్లీని వెంటాడుతున్న మరో సెంటిమెంట్...
‘ఈ సాలా కమ్ నమ్దే...’ ఐపీఎల్లో ఈ స్లోగన్కి ఉన్న ప్లేస్ అంతా ఇంతా కాదు. 13 సీజన్లుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్, ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన ప్రతీసారి ‘ఈ సారి కప్ మాదే’ అంటూ హడావుడి చేయడం... సీజన్ చివరికి వచ్చే సరికి వారి ఆశలు ఆవిరవ్వడం జరుగుతూనే ఉంది. అయినా ఏ మాత్రం నిరుత్సాహపడుకుండా ‘నెక్ట్స్ సాలా కప్ నమ్దే’ అంటూ వచ్చే ఏడాది కోసం ఐపీఎల్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు ఆర్సీబీ ఫ్యాన్స్. ఈసారి ఐపీఎల్లో మరో సెంటిమెంట్ విరాట్ కోహ్లీని వెంటాడుతోంది.
2020 సీజన్లో ఎన్నో చిత్రవిచిత్రాలు జరిగాయి. ఐపీఎల్ 13వ సీజన్లోనూ అనేద ఉత్కంఠభరితమైన మ్యాచులు, సూపర్ ఓవర్ మ్యాచులు చూసే అవకాశం దక్కింది...
టీ20 చరిత్రలోనే డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్కి కూడా వేదికగా మారింది యూఏఈలో జరిగిన 2020 ఐపీఎల్ సీజన్...
అలాగే ఈసారి ఆర్సీబీ కప్పు గెలుస్తుందని అంతా భావించారు. 2020 ఏడాదిలో జరిగిన అనేక అద్భుతాల్లాగే, కోహ్లీ ఐపీఎల్ టైటిల్తో అదరగొడతాడని భావించారు.
అయితే సీజన్ ఫస్ట్ హాఫ్లో అదిరిపోయే విజయాలు అందుకున్న ఆర్సీబీ, వరుసగా ఆరు మ్యాచుల్లో ఓడి ప్లేఆఫ్తో సరిపెట్టుకుంది. ‘ఈ సాలా కప్ నమ్దే’ ఫ్యాన్స్కి మరోసారి నిరాశ తప్పలేదు.
అయితే ఈ 2021 సీజన్ ఆరంభానికి ముందే ఓ సెంటిమెంట్ కోహ్లీ ఫ్యాన్స్ను వెంటాడుతుంది. ఆ సెంటిమెంట్ ప్రకారం చూసుకుంటే ఆర్సీబీ ఈసారి కప్పు గెలవడం పక్కా అంటున్నారు కోహ్లీ ఫ్యాన్స్.
భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్కి 2014లో కూతురు పుట్టింది. అప్పటిదాకా అంత మెరుగైన రికార్డు లేని కోల్కత్తా నైట్రైడర్స్కి మొట్టమొదటి ఐపీఎల్ టైటిల్ అందించాడు గౌతమ్ గంభీర్.
2016లో సన్రైజర్స్ హైదరాబాద్ సారథి డేవిడ్ వార్నర్కి రెండో కూతురు పుట్టింది. ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ మొదటి టైటిల్తో అదరగొట్టింది...
ఆ తర్వాత 2019లో ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మకు సమైరా జన్మించింది... రికార్డు స్థాయిలో ముంబై నాలుగో సారి ఐపీఎల్ టైటిల్ కైవసం చేసుకుంది...
ఈ ఏడాది జనవరిలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంటకు కూతురు జన్మించింది.
అలా చూస్తే ఐపీఎల్ 2021 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ గెలుస్తుందని నమ్ముతున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్.