గాయమైన తర్వాత డ్రెస్సింగ్ రూమ్కి వచ్చి జడేజా అలా చెప్పాడు... క్రికెటర్ సంజూ శాంసన్...
First Published Dec 5, 2020, 12:51 PM IST
ఆసీస్ టూర్లో మొదటి టీ20 మ్యాచ్లో ఘన విజయం సాధించింది టీమిండియా. అయితే ఈ విజయానికి కారణం కంకూషన్ సబ్స్టిట్యూట్ రూల్ను వాడుకుని టీమిండియా, రవీంద్ర జడేజా స్థానంలో యజ్వేంద్ర చాహాల్ను ఆడించడమే అని తీవ్రంగా ఆరోపిస్తోంది ఆస్ట్రేలియా. అయితే రవీంద్ర జడేజా గాయమైన తర్వాత డ్రెస్సింగ్ రూమ్కి వచ్చి ఏం చెప్పాడో తెలియచేశాడు సంజూ శాంసన్.

మిచెల్ స్టార్క్ వేసిన ఆఖరి ఓవర్లో ఓ బంతి నేరుగా వచ్చి రవీంద్ర జడేజా హెల్మెట్కి తగిలింది... దీంతో అతను రెండో ఇన్నింగ్స్లో బరిలో దిగలేదు. అతని స్థానంలో యజ్వేంద్ర చాహాల్ 12వ ప్లేయర్గా జట్టులోకి వచ్చాడు.

‘రవీంద్ర జడేజా ఇన్నింగ్స్ పూర్తయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్కి రాగానే ఎలా ఉందని ఫిజియో నితిన్ పటేల్ అడిగారు. దానికి జడ్డూ... ‘తలమొత్తం డిమ్ముగా ఉందని’ సమాధానం చెప్పాడు’ అని వివరించాడు సంజూ శాంసన్.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?