రంజీ ట్రోఫీ రద్దు చేశారు... ఆ కుర్రాళ్లను ఆర్థికంగా ఆదుకోండి... వసీం జాఫర్ డిమాండ్...
ప్రపంచంలోనే అతి పురాతనమైన క్రికెట్ లీగ్ల్లో ఒకటి రంజీ ట్రోఫీ. 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న రంజీ ట్రోఫీని కరోనా కారణాలు చూపుతూ, 2021- 22 సీజన్ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది బీసీసీఐ. అయితే రంజీ ట్రోఫీపై ఆధారపడిన యువ క్రికెటర్లను ఆర్థికంగా ఆదుకోవాలని బీసీసీఐని డిమాండ్ చేశాడు మాజీ క్రికెటర్ వసీం జాఫర్...
దేశంలో 29 రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు మొత్తం 38 జట్లు రంజీ ట్రోఫీలో పాల్గొంటున్నాయి...
రంజీ టోర్నీ కారణంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో నిరూపించుకునే యువకులు, భారత జట్టులో చోటు దక్కించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు... వసీం జాఫర్ నుంచి సిరాజ్ దాకా చాలామంది ఇలా జట్టులోకి వచ్చినవారే...
గత ఏడాది నిర్వహించిన 87వ సీజన్ రంజీ ట్రోఫీ డిసెంబర్ 2019న మొదలై మార్చి 2020న ముగిసింది... నాలుగు నెలల పాటు సాగే ఈ సుదీర్ఘ సిరీస్ను నిర్వహించడం చాలా కష్టమని భావిస్తోంది బీసీసీఐ...
‘38 జట్లలో రంజీ ట్రోఫీని నిర్వహించడం కొంచెం కష్టమే... నేను అర్థం చేసుకోగలను. కానీ బీసీసీఐ బయటి వ్యక్తిగా నేను ఓ విషయం చెప్పాలనుకుంటున్నా...
ప్లేయర్లను, కోచ్లను, మిగతా సిబ్బందిని దృష్టిలో పెట్టుకుని ఓ ఆటగాడిగా ఆలోచిస్తూ రంజీ ట్రోఫీ నిర్వహించాలని నేను కోరుకుంటున్నా...
రంజీ ట్రోఫీ మీద ఆధారపడి చాలా మంది ప్లేయర్లు బతుకుతున్నారు... రంజీల ద్వారా వచ్చే ఆదాయం వారికి జీవనాధారం, క్రికెట్ కొనసాగించడానికి ఊతాన్ని ఇస్తాయి..
రంజీ ట్రోఫీ ఆడే చాలామందికి ఉద్యోగాలు కూడా ఉండవు. కేవలం క్రికెట్ మీద ఆధారపడి జీవిస్తారు. అలాంటివారిని ఈ కష్ట సమయాల్లో ఆదుకోవాల్సిన బాధ్యత బీసీసీఐదే...
చాలామంది యువ క్రికెటర్ల ఆదాయంపైనే కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. విజయ్ హాజరే ట్రోఫీలో ఒక్కో గేమ్కి రూ.35 వేల నుంచి రూ.40 వేల దాకా వారికి వస్తాయి...
అయితే ఏడాది మొత్తం బతకడానికి ఈ మొత్తం ఏ మాత్రం సరిపోదు.. రంజీ ట్రోఫీ ఆడే క్రికెటర్లలో చాలామంది ఐపీఎల్ కూడా ఆడడం లేదు...
అలాంటి వారిని గుర్తించి, బీసీసీఐ వారికి ఆర్థిక సహాయం చేయాలి... ’ అంటూ చెప్పుకొచ్చాడు వసీం జాఫర్...
గత ఏడాది దేశవాళీ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ప్రకటించిన వసీం జాఫర్... 150 రంజీ మ్యాచులు ఆడిన ప్లేయర్గా రికార్డు క్రియేట్ చేశాడు...
ప్రస్తుతం రంజీల్లో ఉత్తరాఖండ్ కోచ్గా ఉన్న వసీం జాఫర్, ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్కి బ్యాటింగ్ కోచ్గా ఉన్న విషయం తెలిసిందే...