RRvsPBKS: టాస్ గెలిచిన సంజూ శాంసన్... కెప్టెన్గా తొలి మ్యాచ్లో...
ఐపీఎల్లో కెప్టెన్గా తొలి మ్యాచ్ ఆడుతున్న సంజూ శాంసన్...
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్... రెండు జట్ల ద్వారా ఏకంగా ఆరుగురు ప్లేయర్ల ఆరంగ్రేటం...
ఐపీఎల్ 2021 సీజన్లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన ఆర్ఆర్ కెప్టెన్ సంజూ శాంసన్, ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా సంజూ శాంసన్కి ఇది తొలి మ్యాచ్. నేటి మ్యాచ్తో ఏకంగా ఆరుగురు ప్లేయర్లు ఐపీఎల్లో ఆరంగ్రేటం చేస్తుండడం విశేషం.
నేటి మ్యాచ్ ద్వారా రాజస్థాన్ రాయల్స్ తరుపున మనన్ వోహ్రా, ముస్తఫుజుర్ రహ్మన్, చేతన్ సకారియా ఆరంగ్రేటం చేస్తుండగా శివమ్ దూబే, ఆర్ఆర్ తరుపున తొలి మ్యాచ్ ఆడనున్నాడు. మరోవైపు పంజాబ్ కింగ్స్ తరుపున రిలే మెడెరిత్, జే రిచర్డ్సన్, షారుక్ ఖాన్ ఆరంగ్రేటం చేస్తున్నారు.
గత సీజన్లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచుల్లోనూ రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. ఐపీఎల్ వేలంలో రూ.16 కోట్ల 25 లక్షల భారీ ధర దక్కించుకున్న క్రిస్ మోరిస్, నేడు రాయల్స్ తరుపున బరిలో దిగుతున్నాడు.
రాజస్థాన్ రాయల్స్ జట్టు:
మనన్ వోహ్రా, బెన్ స్టోక్స్, సంజూ శాంసన్, జోస్ బట్లర్, శివమ్ దూబే, రియన్ పరాగ్, రాహుల్ తెవాటియా, క్రిస్ మోరిస్, శ్రేయాస్ గోపాల్, చేతన్ సకారియా, ముస్తఫుజుర్ రెహ్మాన్
పంజాబ్ కింగ్స్ జట్టు:
కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, క్రిస్గేల్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, షారుక్ ఖాన్, జే రిచర్డ్సన్, మురుగన్ అశ్విన్, మహ్మద్ షమీ, రిలే మెడెరిత్, అర్ష్దీప్ సింగ్