పృథ్వీషా, ప్రసిద్ధ్ కృష్ణలకు ఛాన్స్? పాండ్యాకి డౌట్... టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కి టీమ్ సెలక్షన్ నేడే...
ఐపీఎల్ 2021 సీజన్కి అర్ధాంతరంగా బ్రేకులు పడడంతో జూన్లో జరిగే ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కి టీమిండియాకి కావాల్సినంత సమయం దొరికింది. దీంతో అనుకున్నదానికంటే ముందుగానే జట్టును ఎంపిక చేసి, ఇంగ్లాండ్ పంపించాలని భావిస్తోంది బీసీసీఐ.
జూన్ 18 నుంచి 22 వరకూ ఇంగ్లాండ్లోని సౌంతమ్టన్ వేదికగా న్యూజిలాండ్తో వరల్ట్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ముందుగా లార్డ్స్లో ఫైనల్ నిర్వహించాలని భావించినా, ఆ తర్వాత వేదికను మార్చింది ఐసీసీ...
టెస్టు ఫార్మాట్లో నిర్వహిస్తున్న మొట్టమొదటి ఐసీసీ ఈవెంట్ను ఎలాగైనా సొంతం చేసుకుని, తన కెరీర్లో మిగిలిపోయిన ఐసీసీ టైటిల్ లోటును తీర్చుకోవాలని భావిస్తున్నాడు భారత సారథి విరాట్ కోహ్లీ...
ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ కోసం భారత జట్టును ఈరోజు ప్రకటించనుంది బీసీసీఐ సెలక్షన్ కమిటీ. ఒకే టెస్టు మ్యాచ్ కోసం దాదాపు 30 మందితో కూడిన జంబో జట్టును ప్రకటించబోతోంది భారత క్రికెట్ బోర్డు...
జూన్ ప్రారంభంలోనే ఇంగ్లాండ్ చేరే భారత జట్టు, అక్కడే రెండు జట్లుగా మారి ప్రాక్టీస్ మ్యాచులు ఆడనుంది. అదీకాకుండా ఆసీస్ టూర్లో భారత జట్టును గాయాలు వేధించిన కారణంగా ముందుజాగ్రత్తగా భారీ టీమ్ను సిద్దం చేయనుంది బీసీసీఐ.
విజయ్ హాజారే ట్రోఫీతో పాటు ఐపీఎల్ 2021 సీజన్లోనూ అదరగొడుతున్న యంగ్ సెన్సేషనల్ బ్యాట్స్మెన్ పృథ్వీషాకి టెస్టు టీమ్లో మళ్లీ ఛాన్స్ దొరికే అవకాశం ఉంది. ఆసీస్ టూర్లో కేవలం ఒకే టెస్టు ఆడి తొలి ఇన్నింగ్స్లో డకౌట్ అయిన పృథ్వీషా, రెండో ఇన్నింగ్స్లో 1 పరుగు చేసి పెవిలియన్ చేరాడు.
అయితే మంచి ఫామ్లో ఉన్న అతనికి టెస్టు టీమ్లో అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు సెలక్టర్లు. పృథ్వీషాతో పాటు శిఖర్ ధావన్ కూడా టెస్టు టీమ్లోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.
రెగ్యూలర్ ఓపెనర్ రోహిత్ శర్మకి తోడుగా మరో నలుగురు ఓపెనర్లను సెలక్ట్ చేయాలని చూస్తోంది బీసీసీఐ. దీంతో పృథ్వీషా, శిఖర్ ధావన్, శుబ్మన్ గిల్, మయాంక్ అగర్వాల్కి టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం ఇంగ్లాండ్ చేరే జట్టులో అవకాశం దక్కొచ్చు.
అలాగే ఐపీఎల్ 2021 సీజన్లో అదరగొడుతున్న యంగ్ పేసర్ ఆవేశ్ ఖాన్ను కూడా సెలక్టర్లు పరిగణనలోకి తీసుకున్నట్టు సమాచారం. అతనితో పాటు ప్రసిద్ధ్ కృష్ణకి కూడా టెస్టు జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది...
కొంతకాలంగా ఫామ్ అందుకోవడానికి ఇబ్బంది పడుతున్న హార్ధిక్ పాండ్యాకి రెస్టు ఇవ్వాలని చూస్తున్న సెలక్టర్లు... మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కోసం 8 నుంచి 9 మందిని ఎంపిక చేయాలని చూస్తున్నారు.
4 లేదా 5 మంది స్పిన్నర్లు, 8 నుంచి 9 మంది ఫాస్ట్ బౌలర్లు, 15 మంది బ్యాట్స్మెన్లు, ఇద్దరు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్లతో కూడిన జంబో జట్టు ఇంగ్లాండ్ చేరి, అక్కడ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడి... ఆ తర్వాత ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ ఆడనుందని సమాచారం.