సౌతాఫ్రికా టూర్ వారం పాటు వాయిదా... ప్రజ్ఞాన్ ఓజాకి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్లో...
అనుకున్నట్టుగానే సౌతాఫ్రికా టూర్ వారం రోజుల పాటు వాయిదా పడింది. డిసెంబర్ 17 నుంచి జరగాల్సిన టూర్ కాస్తా, డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది. కోల్కత్తాలో శనివారం జరిగిన 90వ వార్షిక జనరల్ మీటింగ్లో ఈ నిర్ణయాలు తీసుకుంది బీసీసీఐ...
ఐపీఎల్లో భారత క్రికెటర్ల అసోసియేషన్కి రిప్రెసింటేటివ్గా భారత మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా నియమితుడయ్యాడు. అతనితో పాటు బ్రిజేష్ పటేల్, ఎంకేజే మజుంబర్ కూడా ఈ కౌన్సిల్లో సభ్యులుగా ఉంటారు.
అలాగే మ్యాచ్ అధికారులు, సహాయక సిబ్బంది వయో పరిమితిని 65 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. అయితే వారి ఫిట్నెస్ ఆధారంగా 60 నుంచి 65 ఏళ్ల వరకూ తమ పదవుల్లో కొనసాగవచ్చు...
ఈశాన్య రాష్ట్రాలైన పుదుచ్చేరీ, బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో క్రికెట్ డెవలప్మెంట్కి కావాల్సిన సౌకర్యాల కల్పన, సదుపాయాల ఏర్పాటు కోసం బీసీసీఐ ముందుకొచ్చింది...
దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తున్న కారణంగా వచ్చే నెలలో జరగాల్సిన ఇండియా, సౌతాఫ్రికా సిరీస్పై అనుమానాలు రేగాయి. ఇలాంటి టైంలో సఫారీ టూర్కి బీసీసీఐ అంగీకరించకపోవచ్చని అనుకున్నారంతా...
అయితే సఫారీ టూర్ ఉంటుందని... వచ్చే నెలలో దక్షిణాఫ్రికాలో పర్యటించే భారత జట్టు, వన్డే, టెస్టు సిరీస్ ఆడుతుందని స్పష్టం చేసింది బీసీసీఐ...
అయితే సౌతాఫ్రికా టూర్లో ఆడాల్సిన నాలుగు మ్యాచుల టీ20 సిరీస్ మాత్రం వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. షెడ్యూల్ ప్రకారం భారత జట్టు మూడు వన్డేలు, మూడు టెస్టులు, నాలుగు టీ20 మ్యాచులు ఆడాల్సి ఉంది...
అయితే డిసెంబర్లో వన్డే, టెస్టు సిరీస్ ఆడే భారత జట్టు, టీ20 సిరీస్ను మాత్రం పరిస్థితులు చక్కబడిన తర్వాత ఆడనుంది. ఈ టైమ్లో స్వదేశానికి షెడ్యూల్ కంటే వారం ముందుగా తిరిగి వచ్చే భారత జట్టు, ఇక్కడ క్వారంటైన్లో గడపనుంది.
ఇప్పటికే సౌతాఫ్రికాలో పర్యటించిన భారత్-A జట్టు, సౌతాఫ్రికా- A టీమ్తో కలిసి మూడు అనధికారిక టెస్టు మ్యాచులు ఆడుతోంది. ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ మ్యాచులు నిర్వహిస్తున్నారు...
ఇండియా, సౌతాఫ్రికా సిరీస్ను కూడా ఇలాగే నిర్వహిస్తామని, కట్టుదిట్టమైన బయో సెక్యూలర్ జోన్ ఏర్పాటు చేసి, భారత క్రికెట్ జట్టుకు పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇస్తోంది దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు..
డిసెంబర్ 9న సౌతాఫ్రికా బయలుదేరి వెళ్లాల్సిన భారత జట్టు, ఇప్పుడు డిసెంబర్ 17న సఫారీ టూర్కి వెళ్లనుంది.... వన్డే, టెస్టు సిరీస్ ఆడిన ఆ తర్వాత స్వదేశానికి చేరకుని ముంబైలో బీసీసీఐ ఏర్పాటు చేసే క్యాంపులో క్వారంటైన్ గడపనుందని సమాచారం...