మూడో రోజు ఆగని వర్షం... ఉదయం వాన కురువడంతో ఆలస్యంగా ఆట ప్రారంభం...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ను వరుణుడు వదలడం లేదు. వర్షం కారణంగా తొలి రోజు టాస్ కూడా వేయకుండానే రద్దు కాగా, రెండో రోజు వెలుతురు లేమీ ఆటకు అంతరాయం కలిగించింది. మూడో రోజు కూడా వాతావరణం సపోర్ట్ చేయడం లేదు...
సౌంతిప్టన్లో ఆదివారం తెల్లవారుజామున వర్షం కురిసింది. దీంతో మైదానం చిత్తడిగా మారడంతో ఆట షెడ్యూల్ ప్రకారం సమయానికి ప్రారంభం కాలేదు... అరగంట ఆలస్యంగా ప్రారంభించాలని అంపైర్లు నిర్ణయించారు.
వెలుతురు లేమి కారణంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 64.4 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది...
భారత సారథి విరాట్ కోహ్లీ 44 పరుగులతో, అజింకా రహానే 29 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి వికెట్కి రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు..
సౌంతిప్టన్లో ఐసీసీ ఫైనల్ నిర్వహించాలని నిర్ణయించిన ఐసీసీపై విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. మూడు రోజుల పాటు వాతావరణం ఆటకు అంతరాయం కలిగిస్తూ క్రికెట్ మజాను డిస్టర్బ్ చేస్తుండడం విశేషం..
వాతావరణం ఆటకు అంతరాయం కలిగిస్తుండడం వల్ల ఆడుతూ,ఆగుతూ సాగింది మూడో షెడ్యూల్. దీంతో భారత సారథి విరాట్ కోహ్లీ కూడా కాస్త చిరాకు వ్యక్తం చేశాడు...
అయితే క్రికెటర్ల ఫ్యామిలీలు మాత్రం ఈ వాతావరణాన్ని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. రెండో రోజు ఆట నిలిచిన తర్వాత వేడి వేడి సమోసాలతో ఎంజాయ్ చేస్తున్నట్టు విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ పోస్టు చేసింది.