- Home
- Sports
- Cricket
- శ్రేయాస్ అయ్యర్ కాదు, అతనికే టీమిండియా కెప్టెన్సీ దక్కుతుంది... మాజీ సెలక్టర్ కిరణ్ మోరే...
శ్రేయాస్ అయ్యర్ కాదు, అతనికే టీమిండియా కెప్టెన్సీ దక్కుతుంది... మాజీ సెలక్టర్ కిరణ్ మోరే...
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వయసు 32 ఏళ్లు. మహా అయితే మరో రెండు, మూడేళ్లు మాత్రం అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగే అవకాశం ఉంది. దీంతో టీమిండియా నెక్ట్స్ కెప్టెన్ ఎవరు? అనే డిస్కర్షన్ మొదలైంది. ఫ్యూచర్ కెప్టెన్ రేసులో చాలామంది ప్లేయర్లే ఉన్నారు.

<p>ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును రెండు సీజన్లలో అద్భుతంగా నడిపించి, గత సీజన్లో తొలిసారి ఫైనల్కి చేర్చిన శ్రేయాస్ అయ్యర్, భవిష్యత్ కెప్టెన్ రేసులో ముందువరుసలో ఉన్నాడు. అయితే అయ్యర్ కంటే ఎక్కువగా రిషబ్ పంత్కి కెప్టెన్సీ పగ్గాలు దక్కే అవకాశం ఉందంటున్నాడు మాజీ సెలక్టర్ కిరణ్ మోరే.</p>
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును రెండు సీజన్లలో అద్భుతంగా నడిపించి, గత సీజన్లో తొలిసారి ఫైనల్కి చేర్చిన శ్రేయాస్ అయ్యర్, భవిష్యత్ కెప్టెన్ రేసులో ముందువరుసలో ఉన్నాడు. అయితే అయ్యర్ కంటే ఎక్కువగా రిషబ్ పంత్కి కెప్టెన్సీ పగ్గాలు దక్కే అవకాశం ఉందంటున్నాడు మాజీ సెలక్టర్ కిరణ్ మోరే.
<p>‘నాకు తెలిసి టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ రిషబ్ పంత్. మిగిలిన ప్లేయర్లతో పోలిస్తే రిషబ్ పంత్లోనే కెప్టెన్కి కావాల్సిన లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి...</p>
‘నాకు తెలిసి టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ రిషబ్ పంత్. మిగిలిన ప్లేయర్లతో పోలిస్తే రిషబ్ పంత్లోనే కెప్టెన్కి కావాల్సిన లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి...
<p>రిషబ్ పంత్, భారత జట్టులోకి రావడానికి పడిన కష్టం కంటే, టీమ్లో కుదురుకోవడానికే ఎక్కువ కష్టపడ్డాడు. ధోనీ వారసుడిగా రావడంతో అతనిపైన చాలా ప్రెషర్, అంచనాలు ఉన్నాయి.</p>
రిషబ్ పంత్, భారత జట్టులోకి రావడానికి పడిన కష్టం కంటే, టీమ్లో కుదురుకోవడానికే ఎక్కువ కష్టపడ్డాడు. ధోనీ వారసుడిగా రావడంతో అతనిపైన చాలా ప్రెషర్, అంచనాలు ఉన్నాయి.
<p>వాటని తట్టుకోలేక కెరీర్ ఆరంభంలో చాలా తడబడ్డాడు రిషబ్ పంత్. అయితే ఆస్ట్రేలియా టూర్ నుంచి అతనిలో చాలా పరిణితి కనిపిస్తోంది. ఒడిదుడుకులను తట్టుకుని, కెప్టెన్కి కావాల్సిన లక్షణాలను ఒంటబట్టిచ్చుకున్నాడు రిషబ్ పంత్...</p>
వాటని తట్టుకోలేక కెరీర్ ఆరంభంలో చాలా తడబడ్డాడు రిషబ్ పంత్. అయితే ఆస్ట్రేలియా టూర్ నుంచి అతనిలో చాలా పరిణితి కనిపిస్తోంది. ఒడిదుడుకులను తట్టుకుని, కెప్టెన్కి కావాల్సిన లక్షణాలను ఒంటబట్టిచ్చుకున్నాడు రిషబ్ పంత్...
<p>మానసికంగా దృఢంగా తయారైన రిషబ్ పంత్కి కాకుండా మిగిలిన వారికి కెప్టెన్సీ ఇవ్వాలని జట్టు కూడా భావించకపోవచ్చు. అదీకాకుండా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్గా సాధించిన విజయాలు కూడా పంత్ను కెప్టెన్గా నియమించడానికి కారణంగా మారొచ్చు...</p>
మానసికంగా దృఢంగా తయారైన రిషబ్ పంత్కి కాకుండా మిగిలిన వారికి కెప్టెన్సీ ఇవ్వాలని జట్టు కూడా భావించకపోవచ్చు. అదీకాకుండా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్గా సాధించిన విజయాలు కూడా పంత్ను కెప్టెన్గా నియమించడానికి కారణంగా మారొచ్చు...
<p>టెస్టు ఫార్మాట్లో అదరగొట్టి జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్న రిషబ్ పంత్, ఈ సీజన్లో ఢిల్లీకి కెప్టెన్గా వ్యవహారించడం, తన జట్టును పాయింట్ల పట్టికలో టాప్లో నిలబెట్టడం కూడా చూశాం...</p>
టెస్టు ఫార్మాట్లో అదరగొట్టి జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్న రిషబ్ పంత్, ఈ సీజన్లో ఢిల్లీకి కెప్టెన్గా వ్యవహారించడం, తన జట్టును పాయింట్ల పట్టికలో టాప్లో నిలబెట్టడం కూడా చూశాం...
<p>అతనిలో కెప్టెన్సీ స్కిల్స్ పుష్కలంగా ఉన్నాయనడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఏం కావాలి...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ సెలక్టర్, మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కిరణ్ మోరే.</p>
అతనిలో కెప్టెన్సీ స్కిల్స్ పుష్కలంగా ఉన్నాయనడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఏం కావాలి...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ సెలక్టర్, మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కిరణ్ మోరే.
<p>అయితే క్రికెట్ విశ్లేషకులు మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ సారథిగా ఉన్న శ్రేయాస్ అయ్యర్కే భారత జట్టు కెప్టెన్సీ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు.</p>
అయితే క్రికెట్ విశ్లేషకులు మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ సారథిగా ఉన్న శ్రేయాస్ అయ్యర్కే భారత జట్టు కెప్టెన్సీ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు.
<p>విరాట్ కోహ్లీతో పాటు రిషబ్ పంత్ కూడా ఇంగ్లాండ్ టూర్కి వెళ్తుండడంతో శ్రీలంకలో పర్యటించే జట్టుకి శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్గా వ్యవహరించాల్సింది. అయితే అతను గాయం నుంచి కోలుకోకపోవడంతో మరో ప్లేయర్ కోసం వెతుకుతోంది బీసీసీఐ.</p>
విరాట్ కోహ్లీతో పాటు రిషబ్ పంత్ కూడా ఇంగ్లాండ్ టూర్కి వెళ్తుండడంతో శ్రీలంకలో పర్యటించే జట్టుకి శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్గా వ్యవహరించాల్సింది. అయితే అతను గాయం నుంచి కోలుకోకపోవడంతో మరో ప్లేయర్ కోసం వెతుకుతోంది బీసీసీఐ.
<p>భారత సారథి విరాట్ కోహ్లీ త్వరలోనే వన్డే, టీ20 కెప్టెన్సీని రోహిత్ శర్మకు అప్పగిస్తాడని... మూడు ఫార్మాట్ల కెప్టెన్సీని మోయడం తన వల్ల కాదని తప్పుకుంటాడని కిరణ్ మోరే అభిప్రాయం వ్యక్తం చేయడం విశేషం.</p>
భారత సారథి విరాట్ కోహ్లీ త్వరలోనే వన్డే, టీ20 కెప్టెన్సీని రోహిత్ శర్మకు అప్పగిస్తాడని... మూడు ఫార్మాట్ల కెప్టెన్సీని మోయడం తన వల్ల కాదని తప్పుకుంటాడని కిరణ్ మోరే అభిప్రాయం వ్యక్తం చేయడం విశేషం.