మేమేం చేయలేదు, దాంతో మాకు సంబంధం లేదు... టీమిండియాని మదలించి, వదిలేసిన రిఫరీ...
కేప్ టౌన్ టెస్టులో సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ ఎల్బీడబ్ల్యూ డీఆర్ఎస్ రివ్యూ... క్రికెట్ ప్రపంచంలో చాలా పెద్ద చర్చకే దారి తీసింది. బాల్ ట్రాకింగ్ కంటే ఎక్కువగా టీమిండియా ప్లేయర్లు స్పందించిన తీరు... అంతటా హాట్ టాపిక్ అయ్యింది...
రెండో ఇన్నింగ్స్లో 212 పరుగుల టార్గెట్తో బరిలో దిగిన సౌతాఫ్రికా తొలి వికెట్ని త్వరగా కోల్పోయింది. అయితే ఆ తర్వాత 60 పరుగుల వద్ద డీన్ ఎల్గర్ను అంపైర్ అవుట్గా ప్రకటించడం, థర్డ్ అంపైర్ నాటౌట్గా తేల్చడం వివాదాస్పదమైంది...
బాల్ ట్రాకింగ్ టెక్నాలజీని తప్పుగా వాడి టెస్టు సిరీస్ను కాపాడుకోవాలని సౌతాఫ్రికా ప్రయత్నిస్తోందని భారత జట్టు ప్లేయర్లు బహిరంగంగానే ఆరోపించారు...
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు బౌలర్ రవిచంద్రన్ అశ్విన్, వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్... స్టంప్ మైక్ దగ్గరికి వచ్చి థర్డ్ అంపైర్పై అసహనం వ్యక్తం చేశారు...
‘మ్యాచ్ గెలవాలనుకుంటే దానికి మంచి పద్ధతులు ఎంచుకుంటే బెటర్...’ అని రవిచంద్రన్ అశ్విన్ అంటే, ‘మా పదకొండు మందిని అవుట్ చేసేందుకు దేశామంతా కలిసి ఆడుతున్నట్టుంది...’ అంటూ కామెంట్ చేశాడు కెఎల్ రాహుల్...
‘ప్రత్యర్థిపై కాకుండా మీ టీమ్పైన కూడా ఫోకస్ పెట్టండి, వాళ్లు బాల్ను ఎలా షైన్ చేస్తున్నారో చూడండి. ఎప్పుడూ పక్కనోళ్లపై ఎందుకు ఏడుస్తారు...’ అంటూ స్టంప్ మైక్లో చెప్పాడు విరాట్ కోహ్లీ...
అంతేకాకుండా ‘వికెట్లు కావాలంటే కేవలం క్యాచులు పట్టుకోవాలి, లేదా బౌల్డ్ చేయాలి... మరో దారి లేదు...’ అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ...
ఈ కామెంట్ల కారణంగా విరాట్ కోహ్లీపై ఓ మ్యాచ్ నిషేధం పడే అవకాశం ఉందని భావించారు క్రికెట్ విశ్లేషకులు. విరాట్ కోహ్లీ అండ్ టీమ్ ప్రవర్తన ఐసీసీ ఆర్టికల్ 2.8 నిబంధనకు విరుద్ధం...
ప్రత్యేక్షంగా కానీ, పరోక్షంగా కానీ అంతర్జాతీయ మ్యాచ్లో అంపైర్ల నిర్ణయంపై, థర్డ్ అంపైర్ నిర్ణయంపై కానీ అసంతృప్తి వ్యక్తం చేయడం, ఆరోపణలు చేయడం క్రమశిక్షణారాహిత్యంగా పరిగణిస్తారు...
అయితే ఐసీసీ రిఫరీ ఈ విషయాన్ని పెద్ద సీరియస్గా తీసుకోలేదు. బాల్ ట్రాకింగ్ని తప్పుపట్టిన ప్లేయర్లు, ఏ ఒక్క వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా దూషించకపోవడం వల్ల నిషేధానికి గురి కాకుండా తప్పించుకున్నారు...
మరోసారి ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకూడదని భారత ప్లేయర్లను మందలించి, వదిలి వేసింది ఐసీసీ. దీంతో మ్యాచ్ ఫీజ్ కోతతో పాటు ఓ మ్యాచ్ బ్యాన్ నుంచి బయటపడ్డారు భారత ఆటగాళ్లు...
బాల్ ట్రాకింగ్ని ప్రసారం చేసిన సౌతాఫ్రికా బ్రాడ్కాస్టింగ్ ఛానెల్ సూపర్ స్పోర్ట్ కూడా ఈ వివాదంపై వివరణ ఇస్తూ, స్టేట్మెంట్ విడుదల చేసింది...
‘భారత క్రికెట్ జట్టులో కొందరు ప్లేయర్లు చేసిన కామెంట్లు మా దృష్టికి వచ్చాయి. అయితే మాకు దానికి ఎలాంటి సంబంధం లేదు. హాక్-ఐ టెక్నాలజీ అనేది ఐసీసీ ఆమోదం పొందిన సంస్థ. దాన్నే మేం వాడాం...
హక్-ఐ టెక్నాలజీపై సూపర్ స్పోర్ట్కి ఎలాంటి నియంత్రణ లేదు... వాళ్లు ఇచ్చిందే, మేం టెలికాస్ట్ చేశామంతే’ అంటూ స్టేట్మెంట్లో తెలియచేసింది సూపర్ స్పోర్ట్...