విరాట్ కోహ్లీ ఆ రోజు తిట్టిన తర్వాత... అసలు విషయం బయటపెట్టిన సూర్యకుమార్ యాదవ్...
IPL 2020 సీజన్లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్. బ్యాటింగ్తోనే కాకుండా తన కూల్ యాటిట్యూడ్తో కూడా అభిమానుల మనసు దోచుకున్నాడు. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో హాఫ్ సెంచరీతో బ్యాటింగ్ చేస్తున్న సూర్యకుమార్ యాదవ్ను విరాట్ తిట్టడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ విషయంపై తాజాగా స్పందించాడు సూర్యకుమార్ యాదవ్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముంబై ఇండియన్స్ రెండోసారి తలబడిన మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ చక్కని షాట్లతో అలరించాడు.
డి కాక్, ఇషాన్ కిషన్, సౌరబ్ తివారి, కృనాల్ పాండ్యా వంటి బ్యాట్స్మెన్ అవుట్ అయినా ఆర్సీబీ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కుంటూ ముంబైకి ఈజీ విక్టరీ అందించాడు.
ఆసీస్ టూర్కి భారత జట్టును ఎంపిక చేసిన తర్వాతి రోజు జరిగిన ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ను విరాట్ కోహ్లీ తిడుతూ స్లెడ్జింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
కోహ్లీ తిడుతున్న ఏ మాత్రం పట్టించుకోని సూర్యకుమార్ యాదవ్... బబుల్ గమ్ వాడుతూ కూల్ యాటిట్యూడ్ చూపించాడు. విన్నింగ్ షాట్తో మ్యాచ్ను గెలిపించి... ‘నేనున్నానంటూ’ చేతులతో రోహిత్ శర్మకు సైగ చేశాడు.
43 బంతుల్లో 10 ఫోర్లు, మూడు సిక్సర్లతో 79 పరుగులు పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్... ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా గెలిచాడు.
ఈ సంఘటన తర్వాత సూర్యకుమార్ యాదవ్కీ, విరాట్ కోహ్లీకి మధ్య వైరం పెరిగిందని, అందుకే విరాట్ను తిడుతూ ఓ వ్యక్తి పెట్టిన పోస్టుకి సూర్యకుమార్ యాదవ్ లైక్ కొట్టాడని వార్తలు వచ్చాయి.
అయితే ఆ వివాదం చల్లర్చేందుకు విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోకి పాజిటివ్ కామెంట్ ఇచ్చాడు సూర్యకుమార్ యాదవ్. ‘ఎనర్జీ... సౌండ్ అదిరిపోయింది. డామినేషన్ చూసేందుకు వెయిట్ చేస్తున్నాం’ అంటూ సూర్య పెట్టిన కామెంట్ హాట్ టాపిక్ అయ్యింది.
తాజాగా ఆర్సీబీ, ముంబై మ్యాచ్ తర్వాత ఏం జరిగిందో చెప్పుకొచ్చాడు సూర్యకుమార్ యాదవ్... ‘ప్లేఆఫ్ చేరాలంటే ఆ మ్యాచ్ గెలవడం వారికి చాలా అవసరం. అందుకే విరాట్ చాలా ఒత్తిడిలో ఉన్నాడు. అందుకే నా ఏకాగ్రత చెడగొట్టడానికి అలా చేశాడు...
మ్యాచ్ ముగిసిన తర్వాత నా దగ్గరకు వచ్చి మంచి ఇన్నింగ్స్ ఆడావని మెచ్చుకున్నాడు. నేను కూడా ఆ మ్యాచ్ను చాలా ఎంజాయ్ చేశా... ’ అన్నాడు.
‘ఆసీస్ టూర్కి నేను సెలక్ట్ కానందుకు చాలా బాధపడ్డా... మూడు రోజులు ఎవ్వరితోనూ మాట్లాడలేకపోయాను...’ అంటూ మనసులో మాట బయటపెట్టిన సూర్యకుమార్, సచిన్ ప్రశంస తర్వాత దాన్ని మారిచిపోయానని చెప్పాడు.
‘భారత జట్టుకు ఎంపిక కానందుకు బాధపడుతున్న నాకు సచిన్ టెండూల్కర్ పంపిన మెసేజ్ చాలా ఎనర్జీని ఇచ్చింది. ఆట పట్ల అంకిత భావం ఉంటే అదే నిన్ను పైకి తెస్తుందని సచిన్ చెప్పారు. అది నాలో నూతన ఉత్సాహాన్ని నింపింది’ అంటూ వివరించాడు సూర్యకుమార్ యాదవ్