MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • లండన్‌లో సాక్షి, ధోనీ జంట... మ్యారేజ్ డే సెలబ్రేషన్స్‌తో పాటు మాహీ బర్డ్ డే పార్టీ కూడా అక్కడే...

లండన్‌లో సాక్షి, ధోనీ జంట... మ్యారేజ్ డే సెలబ్రేషన్స్‌తో పాటు మాహీ బర్డ్ డే పార్టీ కూడా అక్కడే...

టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం లండన్ చేరుకున్నాడు. భార్య సాక్షి సింగ్, కూతురు జీవా సింగ్‌తో కలిసి ఇంగ్లాండ్‌ చేరుకున్నాడు ఎమ్మెస్‌డీ. ప్రస్తుతం టీమిండియా, ఇంగ్లాండ్‌తో కలిసి నిర్ణయాత్మక ఐదో టెస్టు ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే ధోనీ లండన్ చేరడానికి, ఈ మ్యాచ్‌కీ ఎలాంటి సంబంధం లేదు...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jul 04 2022, 03:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Image credit: Sakshi Dhoni/Instagram

Image credit: Sakshi Dhoni/Instagram

ఏటా యూఏఈలో హాలీడేస్ ఎంజాయ్ చేసే ఎమ్మెస్ ధోనీ జంట, ఈ సారి మ్యారేజ్ డేతో పాటు మాహీ బర్త్ డేని లండన్‌లో సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. ఇప్పటికే లండన్ చేరుకున్న మాహీ, నయా లుక్‌ని సోషల్ మీడియాలో పోస్టు చేసింది సాక్షి సింగ్...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

క్రికెట్‌లోకి వచ్చిన కొత్తలో ఎలా ఉన్నాడో అచ్చు అలాగే కనిపిస్తూ అందర్నీ షాక్‌కి గురి చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ. ఐపీఎల్ సమయంలో తెల్లగడ్డంతో కనిపించి, వయసైపోయినట్టు కనిపించిన మాహీ.. మళ్లీ ఫిట్‌గా కనిపించడంతో ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు..

39

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ఆయన సతీమణి సాక్షి సింగ్‌ 12వ వివాహ వార్షికోత్సవం నేడు (జూలై 4)... మూడేళ్లు ప్రేమించుకుని, రెండేళ్లు డేటింగ్ చేసి 2010లో పెళ్లి చేసుకుని ఒక్కటైన ఈ జంట దాంపత్యానికి 12 ఏళ్లు నిండాయి...
 

49

గత ఏడాది సాక్షి కోసం స్పెషల్‌గా డిజైన్ చేసిన ఓ బ్లూ కలర్ వింటేజ్ కారును కానుకగా ఇచ్చారు మహేంద్ర సింగ్ ధోనీ. ఈ ఏడాది ఈ ఇద్దరూ లండన్‌లో పార్టీ చేసుకోబోతున్నారు. 12వ వార్షికోత్సవ కానుకగా ధోనీ, సాక్షికి ఏం కానుక ఇచ్చాడో మాత్రం ఇంకా తెలియరాలేదు...

59

ధోనీ జంటకి జీవా ధోనీ అనే కూతురు కూడా ఉన్న విషయం తెలిసిందే. ఆరేళ్ల జీవాకి ఇన్‌స్టాలో సెపరేట్ అకౌంట్ ఉంది. జీవాకి రెండేళ్లు ఉన్నప్పుడే ఆమె పేరిట ఇన్‌స్టా అకౌంట్ తెరిచింది సాక్షి. ప్రస్తుతం ధోనీ కూతురికి సోషల్ మీడియాలో 2 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు...

69

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ మ్యాచులు జరిగిన ప్రతీ సారీ స్టాండ్స్‌లో సాక్షి, జీవాల సందడి కనిపిస్తూ ఉంటుంది. మాహీ బ్యాటింగ్ చేస్తుంటే, అరుస్తూ కేకలు వేస్తూ సపోర్ట్ చేస్తుంటుంది సాక్షి...

79

సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేసే సాక్షి సింగ్, ఓసారి మాహీ తనకు చెప్పులు తొడుగుతున్న ఫోటోలను పంచుకోవడం తీవ్ర దుమారం రేపింది...

89

2020లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నప్పుడు ఎమ్మెస్ ధోనీ కంటే ముందు అభిమానులను నిగ్రహాంగా ఉండాలంటూ పోస్టు చేసింది సాక్షి సింగ్ ధోనీ...

99

2021 సీజన్‌లో కమ్‌బ్యాక్ ఇచ్చిన టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్, 2022 సీజన్‌లో 10 పరాజయాలతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచి... ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది. అయితే 2020 సీజన్ కారణంగా ఈసారి సీఎస్‌కే ఫెయిల్యూర్... ఫ్యాన్స్‌ని పెద్దగా కలిచివేయలేదు..

About the Author

CR
Chinthakindhi Ramu
ఎం.ఎస్. ధోని

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs IRE : ఐర్లాండ్ ల్యాండ్ షేకింగ్ విక్టరీ.. ఈ పసికూన చేతిలో టీమిండియా ఓటమికి టాప్ 5 రీజన్స్ ఇవే
Recommended image2
T20 World Cup 2026: తెలుగమ్మాయి దెబ్బకు వరల్డ్ రికార్డులు బ్రేక్.. టీ20 వరల్డ్ కప్ లో దుమ్మురేపుతున్న శ్రీచరణి
Recommended image3
T20 World Cup: బంగ్లాపై గెలిచినా ఇండియాకు సెమీస్ టెన్షన్.. ఆసీస్‌ను కొడితేనే గండం గట్టెక్కేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved