MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Sports
  • Cricket
  • బంగారపు హుండీని చిల్లర వేయడానికి వాడుకుంటారా... ఐదో టెస్టులో అశ్విన్‌ని పక్కనబెట్టడంపై...

బంగారపు హుండీని చిల్లర వేయడానికి వాడుకుంటారా... ఐదో టెస్టులో అశ్విన్‌ని పక్కనబెట్టడంపై...

ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టులో టీమిండియా సీనియర్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌కి చోటు ఇవ్వకపోవడం తీవ్ర వివాదాస్పమవుతోంది. కీలక సమయాల్లో వికెట్ తీయడమే కాకుండా బ్యాటుతోనూ పరుగులు చేయగల సత్తా ఉన్న అశ్విన్‌ని ఎందుకు పక్కనబెట్టారనేది సమాధానం తెలియని ప్రశ్నగానే మిగిలిపోయింది...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jul 08 2022, 12:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Image credit: Getty

Image credit: Getty

2021 ఇంగ్లాండ్ పర్యటనలో ఆడిన నాలుగు టెస్టుల్లోనూ రవిచంద్రన్ అశ్విన్‌ని ఆడించలేదు టీమిండియా. అప్పటి భారత సారథి విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ రవిశాస్త్రి... నలుగురు పేసర్లతో పాటు స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకి తుదిజట్టులో చోటు కల్పించారు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అయితే శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ అదరగొట్టడంతో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయినా ఆ తర్వాత రెండు మ్యాచుల్లో నెగ్గి, ఓ మ్యాచ్‌లో ఓడింది భారత జట్టు. ఏడాది తర్వాత ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టులోనూ ఇదే ఫార్ములాని వాడింది టీమిండియా...

37

రోహిత్ శర్మ కరోనా బారిన పడి ఐదో టెస్టులో బరిలో దిగకపోవడంతో ఈ నిర్ణయాత్మక టెస్టుకి జస్ప్రిత్ బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇంగ్లాండ్ టూర్‌లో టెస్టు సిరీస్ గెలిచిన మొట్టమొదటి భారత కెప్టెన్ రాహుల్ ద్రావిడ్, హెడ్ కోచ్‌గా ఉన్నాడు. అయినా తుదిజట్టులో రవిచంద్రన్ అశ్విన్‌కి చోటు దక్కలేదు..

47

‘ఇప్పటికీ చాలామందికి జస్ప్రిత్ బుమ్రాని కెప్టెన్‌గా ఎందుకు నియమించారో అర్థం కావడం లేదు. బుమ్రాకి ఉన్న సత్తాని దృష్టిలో పెట్టుకుంటే కెప్టెన్‌గా అతను సరైన వాడే. కొన్నిసార్లు అనుకోకుండా తీసుకున్న నిర్ణయాలే, టీమ్‌కి మంచి చేస్తాయి...

57

అలాగే ఓవల్ టెస్టులో రెండు హాఫ్ సెంచరీలు చేసి, బౌలింగ్‌లో అదరగొట్టాడనే ఉద్దేశంతో శార్దూల్ ఠాకూర్‌కి తుది జట్టులో చోటు ఇచ్చి ఉండొచ్చు. కానీ రవిచంద్రన్ అశ్విన్ తుదిజట్టులో ఎందుకు లేడు? ఇది నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు...

67
Ravichandran Ashwin

Ravichandran Ashwin

అశ్విన్‌ లాంటి ప్లేయర్‌ని ఆడించకపోవడమంటే ఫెర్రారీ కారుని గ్యారేజీలోనే పెట్టడంతో సమానం. బంగారపు హుండీని చిల్లర వేయడానికి వాడుకుంటారా.. ఇంగ్లాండ్‌లో టెస్టులు ఆడిన రాహుల్ ద్రావిడ్‌కి అక్కడ పిచ్‌లు ఎలా స్పందిస్తాయో తెలీదా...

77

నాలుగో రోజు నుంచి పిచ్ స్పిన్నర్లకు చక్కగా సహకరిస్తుంది. రెండో ఇన్నింగ్స్‌లో వికెట్లు తీయడానికి రవిచంద్రన్ అశ్విన్ అద్భుతంగా ఉపయోగపడేవాడు. విదేశాల్లో ఇద్దరు స్పిన్నర్లతో ఆడడంలో తప్పేం లేదు...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ సెలక్టర్ జతిన్ పరన్‌జపే... 

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Recommended image2
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Recommended image3
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved