కేన్ విలియంసన్తో విరాట్ కోహ్లీకి పోటీయే లేదు, వాళ్లిద్దరూ... వీవీఎస్ లక్ష్మణ్ కామెంట్...
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ... ఇద్దరిలో ఎవరు బెస్ట్ టెస్టు బ్యాట్స్మెన్ అనే చర్చ కొన్నిరోజులుగా జోరుగా సాగుతోంది. అయితే ఈ ఇద్దరి మధ్య ఎలాంటి పోటీ లేదంటున్నాడు భారత మాజీ క్రికెటర్, వెరీ వెరీ స్పెషల్ బ్యాట్స్మెన్ వీవీఎస్ లక్ష్మణ్...
పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, విండీస్తో జరిగిన సిరీస్ల్లో సెంచరీల మోత మోగించిన కేన్ విలియంసన్, టెస్టుల్లో నెం.1 బ్యాట్స్మెన్గా టాప్లోకి ఎగబాకాడు. ఇదే సమయంలో ఆసీస్తో మొదటి వన్డే, ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో సెంచరీ మార్క్ అందుకోలేకపోయిన విరాట్ కోహ్లీ టాప్ 5 ర్యాంకుకి పడిపోయాడు.
బ్యాట్స్మెన్గా ఎవరు గ్రేట్ అనేది పక్కనబెడితే విరాట్ కోహ్లీ, కేన్ విలియంసన్ కెప్టెన్సీలకు అసలు సిసలు పరీక్ష ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ రూపంలో ఎదురుకానుంది...
‘కేన్ విలియంసన్, విరాట్ కోహ్లీ చాలా మంచి స్నేహితులు. వారి కెరీర్ ఆసాంతం ఎంతో అద్భుతంగా జరిగింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో విరాట్, కేన్ విలియంసన్ మధ్య కెప్టెన్సీ బలం నిరూపించుకునే పోటీ ఉంటుందని చాలామంది అంటున్నారు.
అయితే నా దృష్టిలో వారి మధ్య ఎలాంటి పోటీ ఉండదు. ఎందుకంటే కోహ్లీ అంటే కేన్ విలియంసన్కి ఎంతో గౌరవం. కోహ్లీకి కూడా కేన్ విలియంసన్ విషయంలో ఇదే అభిప్రాయం ఉంది. విరాట్, కేన్ విలియంసన్ ఇద్దరూ ఇప్పుడు లెజెండ్స్...
విరాట్ కోహ్లీకి ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కేన్ విలియంసన్ విషయంలో కూడా అంతే. కేన్కి ఇక్కడ కూడా ఫ్యాన్స్ ఉన్నారనే విషయం తెలిసిందే. ఇద్దరూ తమ తమ జట్లను అద్భుతంగా నడిపిస్తున్నారు...
అంకితభావం విషయంలో కేన్ విలియంసన్, విరాట్ కోహ్లీ ఇద్దరూ ఇద్దరే.... కాబట్టి వారి మధ్య లేని పోటీని ఇప్పుడు మీరు క్రియేట్ చేయకండి...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్...
‘వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్లో జరుగుతోంది కాబట్టి న్యూజిలాండ్కి అక్కడి కండీషన్ బాగా కలిసి వస్తాయి. అదే ఇండియాలో కానీ, ఆసియాలో మరో దేశంలో జరిగి ఉంటే ఫైనల్ మ్యాచ్ కచ్ఛితంగా భారత్దే...
విదేశాల్లో టెస్టు సిరీస్లు ఆడేటప్పుడు ప్రాక్టీస్ మ్యాచులు నిర్వహించేవాళ్లు. కాని ఇప్పుడు భారత జట్టు నేరుగా వెళ్లి, ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. అదే సమయంలో న్యూజిలాండ్, ఆతిథ్య ఇంగ్లాండ్తోనే రెండు టెస్టులు ఆడుతోంది...
వారికి కావాల్సిన ప్రాక్టీస్, ప్రిపరేషన్ అన్నీ ఈ రెండు టెస్టుల్లో దొరుకుతాయి. అదీకాకుండా న్యూజిలాండ్, భారత్కంటే 10 రోజుల ముందుగానే ఇంగ్లాండ్కి వెళ్లింది... వాళ్లు ఇప్పటికే అక్కడి కండీషన్స్కి అలవాటు పడి ఉంటారు.
అయితే ఆస్ట్రేలియా టూర్లో భారత జట్టు ఆడిన తీరు, ఇంగ్లాండ్లో కూడా రిపీట్ చేస్తే ఫైనల్ మ్యాచ్ గెలవడం పెద్ద కష్టమేమీ కాదు... ప్రాక్టీస్కి మనవాళ్లు ఎక్కువ సమయం కేటాయించాలి’ అంటూ కామెంట్ చేశాడు వీవీఎస్ లక్ష్మణ్...