MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • 8 ఏళ్ల తర్వాత టెస్ట్ క్రికెట్‌లో అరుదైన రికార్డ్

8 ఏళ్ల తర్వాత టెస్ట్ క్రికెట్‌లో అరుదైన రికార్డ్

India West Indies Test: భారత్-వెస్టిండీస్ రెండో టెస్ట్ నాలుగో రోజు అరుదైన రికార్డు సాధించింది. సూపర్ కమ్ బ్యాక్ తో వెస్టిండీస్ మ్యాచ్ ను ఐదో రోజువరకు తీసుకెళ్లింది. 10వ వికెట్‌కు 79 పరుగుల భాగస్వామ్యంతో విండీస్ కొత్త రికార్డు సృష్టించింది.

2 Min read
Mahesh Rajamoni
Published : Oct 14 2025, 01:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
భారత వెస్టిండీస్ రెండో టెస్ట్‌లో అరుదైన సంఘటన
Image Credit : Instagram/indiancricketteam

భారత-వెస్టిండీస్ రెండో టెస్ట్‌లో అరుదైన సంఘటన

భారత్, వెస్టిండీస్ మధ్య ఢిల్లీలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు చరిత్ర సృష్టించింది. 8 ఏళ్ల తర్వాత టెస్ట్ క్రికెట్‌లో అరుదైన ఘనత నమోదైంది. వెస్టిండీస్ చివరి వికెట్ జోడీ జస్టిన్ గ్రీవ్స్, జేడెన్ సీల్స్ అద్భుతంగా ఆడుతూ భారత బౌలర్లను ఆశ్చర్యపరిచారు. ఈ ఇద్దరు ప్లేయర్లు కలిసి 10వ వికెట్‌కు 79 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి అరుదైన రికార్డు సృష్టించారు.

26
10వ వికెట్ భాగస్వామ్యంతో చరిత్ర సృష్టించిన విండీస్
Image Credit : X/@

10వ వికెట్ భాగస్వామ్యంతో చరిత్ర సృష్టించిన విండీస్

2017 తర్వాత ఇది మొదటిసారి టెస్ట్ క్రికెట్‌లో ప్రత్యర్థి జట్టు చివరి వికెట్‌కు 50 పరుగులకుపైగా భాగస్వామ్యం నమోదు చేసిన సందర్భంగా నిలిచింది. 2010లో మోయ్సెస్ హెన్రిక్స్, నాథన్ లియాన్ జంట భారత్‌పై చెన్నై టెస్టులో 66 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఆ తర్వాత 2017లో పుణేలో మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్ జంట 55 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఇప్పుడు 2025లో ఢిల్లీలోని అరుణ్ జేట్లీ స్టేడియంలో సీల్స్, గ్రీవ్స్ జోడీ 79 పరుగులతో ఆ రికార్డులను అధిగమించింది.

Related Articles

Related image1
Ellyse Perry : ప్రపంచంలో రిచెస్ట్ మహిళా క్రికెటర్ ఎవరో తెలుసా?
Related image2
పాకిస్తాన్ కు షాకిచ్చిన ఆఫ్ఘనిస్తాన్.. ట్రై సిరీస్ జరిగేనా?
36
గతంలో భారత్‌పై 10వ వికెట్ భాగస్వామ్య రికార్డులు
Image Credit : X/windiescricket

గతంలో భారత్‌పై 10వ వికెట్ భాగస్వామ్య రికార్డులు

భారత్‌పై 10వ వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యాల్లో 1962లో సర్ ఫ్రాంక్ వారెల్, వెస్లీ హాల్ 98* పరుగులు చేశారు. 2000లో ఆండీ ఫ్లవర్, హెన్రీ ఓలొంగా 97* పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. 1987లో ఇమ్రాన్ ఖాన్, తౌసీఫ్ అహ్మద్ జంట 81 పరుగులు సాధించారు. ఇప్పుడు సీల్స్, గ్రీవ్స్ జంట 79 పరుగులతో ఈ లిస్టులో చేరారు.

46
హోప్, క్యాంప్‌బెల్‌ల సెంచరీల మోత
Image Credit : X/@wiplayers

హోప్, క్యాంప్‌బెల్‌ల సెంచరీల మోత

విండీస్ జట్టు ఫాలోఆన్ ఆడుతూ అద్భుత పోరాటం చేసింది. షాయ్ హోప్ (115 పరుగులు), జాన్ క్యాంప్‌బెల్ (103 పరుగులు) సెంచరీలు సాధించారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 177 పరుగుల భాగస్వామ్యంతో భారత్ బౌలర్లను బెంబేలెత్తించారు. క్యాంప్‌బెల్ తన సెంచరీ నాక్ లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో చక్కటి బ్యాటింగ్ చేశాడు. హోప్ 12 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. జడేజా క్యాంప్‌బెల్‌ను అవుట్ చేసి ఆ జంటను విడగొట్టగా, తర్వాత షాయ్ హోప్ - రోస్టన్ చేజ్ జంట మరో 59 పరుగులు చేసింది. దీంతో విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 390 పరుగులు చేసింది.

56
విజయానికి చేరువగా భారత్
Image Credit : BCCI

విజయానికి చేరువగా భారత్

భారత్ జట్టు విజయానికి ఇంకా 58 పరుగులు కావాలి. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 518/5 స్కోరుతో డిక్లేర్ చేసింది. విండీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 248 పరుగులు చేసి ఫాలోఆన్ ఆడింది. రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ 390 పరుగులు సాధించి భారత్‌కు 121 పరుగుల టార్గెట్ ఇచ్చింది.

నాల్గో రోజు ముగిసే సరికి భారత్ 63/1 పరుగులతో ఆడుతోంది. యశస్వి జైస్వాల్ (8) త్వరగా అవుట్ కాగా, కేఎల్ రాహుల్ (25* పరుగులు), సాయి సుదర్శన్ (30* పరుగులు) క్రీజ్‌లో ఉన్నారు.

66
బుమ్రా, కుల్దీప్ మెరుపులు
Image Credit : BCCI

బుమ్రా, కుల్దీప్ మెరుపులు

భారత్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా తలా మూడు వికెట్లు తీశారు. మహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ సాధించారు. విండీస్ 311/9 పరుగుల వద్ద వుండగా, గ్రీవ్స్- సీల్స్ జోడీ అద్భుతమైన ఆటతో ఆకట్టుకుంది. ఈ జంట 79 పరుగులు జోడించి విండీస్ టార్గెట్‌ను 100 రన్స్ దాటేలా చేసింది. అలాగే, ఈ జోడీని విడదీయడం భారత్ బౌలర్లకు పెద్ద సవాల్‌గా కూడా మారింది.

శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో భారత్‌కు ఇది మొదటి టెస్ట్ సిరీస్ గెలుపు అవుతుంది. విండీస్ బలంగా పోరాడినా, భారత్ విజయానికి కేవలం కొన్ని పరుగుల దూరంలో ఉంది. ఐదవ రోజు భారత్ విజయంతో 2-0 తేడాతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయనుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved