కోహ్లీకి ఏం చేయాలో బాగా తెలుసు, కేవలం ఇండియా ఫైనల్ ఆడడం వల్లే... - పాక్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా..
టెస్టు ఫార్మాట్లో ఐసీసీ నిర్వహిస్తున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ నిర్వహణ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు పాక్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ రమీజ్ రాజా. కేవలం ఇండయా ఫైనల్ ఆడుతుండడం వల్లే, అంతో కొంతో క్రేజ్ వచ్చిందని లేదంటే ఎవ్వరూ పట్టించుకునేవారు కాదని హాట్ కామెంట్లు చేశాడు.
‘విరాట్ కోహ్లీ రన్ మెషిన్లాంటోడు. అతనికి ఎలా ఆడాలో చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అతను లెగ్ సైడ్ లైన్ క్రాస్ చేసి ఆడుతున్నాడు. ఫలితంగా తన మోచేతికి ఎక్కువగా దెబ్బలు కూడా తగులుతున్నాయి.
అతను తన పొజిషన్ను సరి చేసుకుని, స్టైయిట్గా ఆడతే... ఎలాంటి సమస్యా రాదు. అయినా విరాట్ కోహ్లీని ఏం చేయాలో, ఎలా చేయాలో బాగా తెలుసు. కాబట్టి ఎవ్వరూ అతని ఫామ్ గురించి భయపడాల్సిన అవసరం లేదు...
కొన్నిసార్లు సెంచరీ మార్కు రాకపోతే, ఆ క్రికెటర్ ఒత్తిడిలో ఉన్నాడేమోనని అనుకుంటారు. కానీ విరాట్ కోహ్లీ ధారాళంగా పరుగులు చేస్తున్నాడు. సెంచరీ మార్కు మాత్రం అందుకోలేకపోతున్నాడు.
కోహ్లీ తాను ఎదుర్కొనే మొదటి 20-25 ఓవర్లు స్ట్రైయిట్గా ఆడతాడు. ఆ తర్వాత తన మణికట్టును తిప్పడం మొదలెడతాడు. నా అంనా ప్రకారం వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో కోహ్లీ నుంచి ఓ మంచి ఇన్నింగ్స్ చూడబోతున్నాం...’ అంటూ చెప్పుకొచ్చాడు రమీజ్ రాజా...
‘వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ టోర్నీ నిర్వహణకు రెండేళ్ల షెడ్యూల్ తీసుకోవడం కరెక్టు కాదు. దీన్ని ప్రత్యేకమైన విండోలో నిర్వహించాలి. ఓ ఆరు నెలల పాటు టెస్టు క్రికెట్ ఆడే జట్ల మధ్య మ్యాచులు నిర్వహిస్తే బాగుంటుంది...
ఈ సమయంలో వన్డే, టీ20 ఫార్మాట్ మ్యాచులు నిర్వహించకూడదు. ఎందుకంటే వన్డే, టీ20 మ్యాచులు ఉంటే, జనాలు టెస్టులను చూడడానికి ఇష్టపడకపోవచ్చు. టెస్టుల కోసమే ప్రత్యేకమైన విండో రూపొందిస్తే ఈ ఛాంపియన్షిప్ ఇంట్రెస్టింగ్గా తయారవుతుంది.
రెండేళ్లంటే చాలా ఎక్కువ. ఇంత సుదీర్ఘమైన ఫార్మాట్లో టోర్నీ నిర్వహిస్తే ఎవరు ఏ టీమ్తో ఆడారనే విషయం కూడా జనాలకు గుర్తుండదు. కేవలం ఇండియా ఫైనల్లో ఉండడం వల్లే జనాలు, ఈ టోర్నీని ఆసక్తికరంగా చూస్తున్నారు.
న్యూజిలాండ్తో పాటు మరో టీమ్ ఫైనల్కి వచ్చి ఉంటే, ఈ ఫైనల్ మ్యాచ్ను ఎవ్వరూ పట్టించుకునేవారు కూడా. ఇంత ఇంట్రెస్ట్ జనాల్లో కలిగేది కాదు...’ అంటూ కామెంట్ చేశాడు రమీజ్ రాజా...