ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్కి డౌట్.. అయితే ఐపీఎల్లో అన్ని మ్యాచులు ఆడనున్న బుమ్రా... అదేగా ముఖ్యం...
అప్పుడెప్పుడో గత ఏడాది ఆగస్టులో జరిగిన ఆసియా కప్ 2022 టోర్నీకి ముందు వెన్నుగాయంతో జట్టుకి దూరమయ్యాడు జస్ప్రిత్ బుమ్రా. ఆ తర్వాత కోలుకున్నా అని చెప్పి 2 మ్యాచులు ఆడి, మళ్లీ టీమ్ నుంచి వెళ్లిపోయాడు. గాయంతో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడని బుమ్రా, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లో ఆడడమూ అనుమానంగా మారింది...
Image credit: Getty
జస్ప్రిత్ బుమ్రా పూర్తిగా కోలుకున్నాడని, న్యూజిలాండ్తో వన్డే సిరీస్కి ఎంపిక చేసింది బీసీసీఐ. అయితే ఏమైందో ఏమో మూడు రోజుల్లో బుమ్రా గాయం నుంచి ఇంకా కోలుకోలేదని చెప్పి, న్యూజిలాండ్ సిరీస్ నుంచి తప్పించింది...
జస్ప్రిత్ బుమ్రా కోలుకున్నాడని ఎందుకు ప్రకటించారు? అంతలోనే తూచ్! ఇంకా కోలుకోలేదని ఎందుకు తప్పించారో సగటు టీమిండియా అభిమానికి అస్సలు అర్థం కాలేదు. దీని వెనక ఏదో రాజకీయం జరిగిందని మాత్రం అందరికీ అర్థమైంది..
Jasprit Bumrah
పాటు మోకాలి గాయాన్ని కూడా లెక్క చేయకుండా భార్య ఎన్నికల ప్రచారంలో యమా జోరుగా తిరిగిన రవీంద్ర జడేజా కూడా ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నారు..
Kieron Pollard
అధికారికంగా ప్రకటించకపోయినా ఈ ఇద్దరూ ప్రాక్టీస్ చేస్తోంది, పూర్తి ఫిట్నెస్ సాధించడంపై ఫోకస్ పెట్టింది మార్చి నెలఖారులో ప్రారంభమయ్యే ఐపీఎల్ 2023 కోసమే... ఎందుకంటే జస్ప్రిత్ బుమ్రా, ఆస్ట్రేలియాతో జరిగే తొలి రెండు టెస్టుల్లో ఆడేది అనుమానమేనని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ స్వయంగా ప్రకటించాడు...
Jasprit Bumrah
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడకపోయినా ఆ తర్వాత ఐపీఎల్ 2023 సీజన్లో ముంబై ఇండియన్స్ తరుపున 14 నుంచి 17 మ్యాచుల వరకూ అందుబాటులో ఉండబోతున్నాడు జస్ప్రిత్ బుమ్రా... గాయాలతో జట్టుకి నెలలకు నెలలు దూరమయ్యే రవీంద్ర జడేజా కూడా సీఎస్కే తరుపున అన్ని మ్యాచులు ఆడేందుకు ప్రాక్టీస్ చేస్తున్నాడు..
bumrah
ఇప్పటికే ట్రెంట్ బౌల్ట్, జేమ్స్ నీశమ్ వంటి న్యూజిలాండ్ ప్లేయర్లు, టీ20 లీగ్లు ఆడేందుకు సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ఇలాంటి పరిస్థితి టీమిండియాలో కూడా చూడొచ్చు...
Jasprit Bumrah
వాస్తవానికి అధికారికంగా సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకోకపోయినా భారత ప్లేయర్లు చేస్తుంది ఇదే. ఐపీఎల్లో రెండు నెలల పాటు మ్యాచులు ఆడినా అలసిపోని ప్లేయర్లు, టీమిండియా తరుపున మూడు మ్యాచులు ఆడగానే వర్క్ లోడ్ మేనేజ్మెంట్ పేరుతో మరో రెండు వారాల పాటు రెస్ట్ తీసుకుంటున్నారు..
టీమిండియాకి ఆడడం కంటే ఐపీఎల్ ఆడడానికి ప్రాధాన్యం ఇచ్చే ప్లేయర్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, అలాంటి వారిని టీమిండియాకి సెలక్ట్ చేయకుండా తగిన బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు టీమిండియా అభిమానులు...
Image credit: Getty
అయితే ఐపీఎల్కి ఉన్న క్రేజ్ దృష్ట్యా, టీమిండియాకి ఆడినా ఆడకపోయినా తమ ఫెవరెట్ ప్లేయర్లు, తమ ఫెవరెట్ ఫ్రాంఛైజీ తరుపున ఆడినప్పుడు బాగా ఆడితే చాలనుకునే ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ కూడా వేల సంఖ్యలో ఉండడం విశేషం...