MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2022: ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కీలక ఆదేశం.. ఆ తేదీకల్లా ముంబైలో ఉండాల్సిందే.. కఠిన ఆంక్షలు విధింపు

IPL 2022: ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కీలక ఆదేశం.. ఆ తేదీకల్లా ముంబైలో ఉండాల్సిందే.. కఠిన ఆంక్షలు విధింపు

IPL 2022 Schedule:  కరోనా కాలంలో జరుగుతున్న మూడో ఐపీఎల్ ఇది. గత రెండు సీజన్ల మాదిరిగా కాకుండా కొత్త ఫార్మాట్ లో జరుగుతున్న 2022 ఐపీఎల్ సీజన్ ను విజయవంతం చేసేందుకు బీసీసీఐ నడుం కట్టింది. 

2 Min read
Author : Srinivas M
Published : Mar 02 2022, 05:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

ఈనెల 26 నుంచి  మహారాష్ట్ర వేదికగా ప్రారంభం కాబోయే  ఐపీఎల్-15 సీజన్ కు సర్వం సిద్ధమవుతున్నది.  ఈ మేరకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లను చకచకా పూర్తి చేస్తున్నది.  మెగా టోర్నీకి టైం దగ్గర పడుతున్న నేపథ్యంలో  లీగ్ లోని పది జట్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

జట్లన్నీ ఈనెల 8 లోపు  ముంబైకు చేరుకోవాలని తెలిపింది.  కోచింగ్, సహాయక సిబ్బంది, ఫ్రాంచైజీల ప్రతినిధులు, అందుబాటులో ఉన్న ఆటగాళ్లంతా జట్లతో వెళ్తారు. 

39

బయో బబుల్ లో కఠిన ఆంక్షల నడుమ జరుగనున్న ఈ ఐపీఎల్ లో   మార్చి 8 లోపు ముంబైకి చేరబోయే  జట్ల ప్రతినిధులు.. మూడు  రోజుల పాటు  క్వారంటైన్ లో గడపాల్సి ఉంటుంది. 

49

ఇక మార్చి 14-15 వ తేదీ కల్లా  అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో ప్రాక్టీస్ సెషన్ నిర్వహించుకోవచ్చునని  బీసీసీఐ ఆదేశించింది. అయితే  తమ తమ జట్లతో చేరబోయే భారత ఆటగాళ్లు మూడు రోజుల పాటు.. విదేశీ ఆటగాళ్లైతే  కచ్చితంగా ఐదు రోజుల పాటు క్వారంటైన్ గడపాల్సిందే. 

59

ముంబైకి రావడానికి రెండు రోజుల ముందు తీసుకున్న ఆర్టీపీసీఆర్  రిపోర్డును బీసీసీఐకి సమర్పించాల్సి ఉంటుంది. ఇది జట్ల ప్రతినిధులు కోచ్ లు, సహాయక సిబ్బంది, ఆటగాళ్లు.. అందరికీ వర్తిస్తుంది. 

69

ఈ మేరకు  ప్రత్యేకంగా కేటాయించిన హోటల్స్ లో అన్ని ఏర్పాట్లతో కూడిన ఏర్పాట్లను కూడా పూర్తి చేసినట్టు సమాచారం. క్వారంటైన్ లో ఉండే అందరికీ  ప్రతిరోజు టెస్టులను  నిర్వహిస్తారు. ఈ  మేరకు బీసీసీఐ వైద్య బృందం అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉంది. 

79

ఇదిలాఉండగా.. ముంబైలోని వాంఖడే, డీవై పాటిల్ స్టేడియంలో తలో 20 మ్యాచులు జరుగనుండగా.. బ్రబోర్న్ లో 15, పూణె స్టేడియంలో 15 మ్యాచులు జరుగుతాయి. 

89

ఈనెల 26 నుంచి ఐపీఎల్ ప్రారంభం కావాల్సి ఉన్న నేపథ్యంలో బీసీసీఐ తాత్కాలిక సీఈవో హేమాంగ్ అమిన్.. మహారాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య థాక్రేతో పాటు మరో మంత్రి ఏక్నాథ్ షిండే తో కలిసి సమావేశమయ్యారు.  ఐపీఎల్-15 నిర్వహణకు  ప్రభుత్వ సహకారం కావాలని  అమిన్ కోరారు. 
 

99

దీంతో ఈ మెగా టోర్నీకి తమ ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకారం ఉంటుందని థాక్రే హామీ ఇచ్చారు.  ఐపీఎల్ జట్లు ప్రయాణించడానికి వీలుగా..  గ్రీన్ కారిడర్ (ట్రాఫిక్ లేకుండా చేయడం) ను ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వం అంగీకరించింది.   
 

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs ENG: తిలక్ వర్మ సహా ఇద్దరు స్టార్లకు బిగ్ షాక్.. టీమిండియాలో భారీ మార్పులు
Recommended image2
IND vs ENG: ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజయం.. భారత్ సిరీస్ కోల్పోవడానికి 5 ప్రధాన కారణాలు ఇవే
Recommended image3
Indian cricketers : కోహ్లీ ఒక్కడే కాదు, ఈ ఇండియన్ క్రికెటర్లు కూడా ఫారిన్ లో సెటిల్.. ఎవరు, ఏ దేశంలో ఉంటున్నారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved