రెండు వందలా.. అది మాకు చాలా చిన్న విషయం.. ‘ఉఫ్’మని ఊదేస్తాం..
IPL 2023: ఐపీఎల్ లో ఒక టీమ్ ఆడేది ఇన్నింగ్స్ లో 20 ఓవర్లే. కానీ 200 కు పైగా టార్గెట్ పెట్టినా ‘ఉఫ్’మని ఊదేస్తామంటున్నాయి కొన్ని జట్లు..

Image credit: PTI
టీ20 ఫార్మాట్ క్రికెట్ లో పెను మార్పులకు కారణమవుతున్నది. ‘బాదుడే లక్ష్యం.. దూకుడే మార్గం’ అన్న సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న టీమ్స్.. 120 బంతుల్లో డబుల్ హండ్రెడ్ టార్గెట్ ను కూడా ఉఫ్మని ఊదేస్తున్నాయి.
పంజాబ్ - ముంబై మధ్య నిన్న మొహాలీ వేదికగా జరిగిన ఐపీఎల్ -16.. 46వ లీగ్ మ్యాచ్ లో భాగంగా పంజాబ్ నిర్దేశించిన 215 పరుగుల లక్ష్యాన్ని ముంబై మరో ఏడు బంతులు మిగిలుండగానే ఛేదించింది. తద్వారా ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఐపీఎల్ లో హయ్యస్ట్ టార్గెట్స్ ఛేజ్ చేసిన జట్ల గురించి ఇక్కడ చూద్దాం.
Image credit: PTI
ఐపీఎల్ లో అత్యధిక ఛేదన చేసిన జట్టు రాజస్తాన్ రాయల్స్. 2020లో షార్జా వేదికగా ముగిసిన ఓ మ్యాచ్ లో రాజస్తాన్.. పంజాబ్ నిర్దేశించిన 224 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.
2021లో ముంబై ఇండియన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై.. 20 ఓవర్లలో 218 పరుగులు చేసింది. ఛేదనలో ముంబై.. ఆఖరి బంతికి విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో కీరన్ పొలార్డ్.. 34 బంతుల్లోనే 87 పరుగులు చేశాడు.
2008 సీజన్ లో డెక్కన్ ఛార్జర్స్ నిర్దేశించిన 215 పరుగుల లక్ష్య ఛేదనను రాజస్తాన్.. 19.5 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్ లో డెక్కన్ ఛార్జర్స్ ఆటగాడు ఆండ్రూ సైమండ్స్ సెంచరీ చేశాడు.
ఈ లీగ్ లో 200 ప్లస్ టార్గెట్ ను ఛేదించడం ముంబైకి ఇది రెండో సారి. కొద్దిరోజుల క్రితమే ముంబై.. రాజస్తాన్ పై 213 పరుగుల టార్గెట్ ను ఛేదించగా నిన్న మళ్లీ పంజాబ్ పై ఇదే ఫీట్ నమోదు చేసింది. కాగా ఈ సీజన్ లో 200 ప్లస్ టార్గెట్ ను ఛేదించడం ఇది ఐదో సారి.