రిషబ్ పంత్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ... ముగ్గురూ ఒక్కటే! ఐపీఎల్ 2022 సీజన్లో...
ఐపీఎల్ 2022 సీజన్లో స్టార్లుగా బరిలో దిగినవారిలో చాలామంది స్థాయికి తగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్తో పాటు ఫైవ్ టైం విన్నింగ్ టీమ్ ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉన్నాయి...

ఐపీఎల్ 2022 సీజన్లో సాధారణ ప్లేయర్గా బరిలో దిగిన విరాట్ కోహ్లీ, ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 36 బంతుల్లో 5 ఫోర్లతో 48 పరుగులు చేయడం మినహా చెప్పుకోదగ్గ పర్పామెన్స్ ఇవ్వలేకపోయాడు.
ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ బ్యాటింగ్లో వరుసగా ఫెయిల్ అవుతూ ఉండడం కూడా ఆ జట్టు విజయావకాశాలను దెబ్బ తీస్తోంది...
పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 28 పరుగులు చేసిన రోహిత్ శర్మ, ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఆరంభ మ్యాచ్లో 32 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 పరుగులు చేశాడు..
అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ సారథిగా రెండో సీజన్ ఆడుతున్న రిషబ్ పంత్ బ్యాటు నుంచి కూడా ఆశించిన పర్ఫామెన్స్ అయితే రాలేదు. పంత్ కెప్టెన్సీ భారంతో తన స్టైల్ మార్చుకుని ఆడుతున్నట్టు కనిపిస్తోంది...
గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 29 బంతుల్లో 7 ఫోర్లతో 43 పరుగులు చేసిన రిషబ్ పంత్... మిగిలిన మ్యాచుల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు...
Rishabh Pant, Rohit Sharma
రిషబ్ పంత్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ముగ్గురూ కూడా ఇప్పటిదాకా సరిగ్గా 81 బంతులనే ఫేస్ చేయడం విశేషం. రిషబ్ పంత్ తాను ఎదుర్కొన్న 81 బంతుల్లో 110 పరుగులు చేశాడు...
Virat Kohli
రోహిత్ శర్మ 81 బంతుల్లో 108 పరుగులు చేయగా ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 107 పరుగులు మాత్రమే చేయగలిగాడు...
టీమిండియా ప్రస్తుత సారథి రోహిత్ శర్మతో పాటు మాజీ సారథి విరాట్ కోహ్లీ... భావి సారథిగా అంచనా వేస్తున్న రిషబ్ పంత్ ముగ్గురూ కూడా 81 బంతులే ఎదుర్కోవడం విశేషం...