MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఐపీఎల్‌లో నన్ను అలా అవమానించారు... ఆర్‌సీబీ యాజమాన్యంపై విరాట్ కోహ్లీ కామెంట్స్...

ఐపీఎల్‌లో నన్ను అలా అవమానించారు... ఆర్‌సీబీ యాజమాన్యంపై విరాట్ కోహ్లీ కామెంట్స్...

ఐపీఎల్ కెరీర్‌లోనే ఆరంభం నుంచి ఇప్పటిదాకా 15 సీజన్ల పాటు ఒకే ఫ్రాంఛైజీకి ఆడిన ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లీ... ఎమ్మెస్ ధోనీ, సురేష్ రైనా వంటి ప్లేయర్లు సీఎస్‌కేపై రెండేళ్లు బ్యాన్ పడడంతో ఈ రికార్డును సాధించలేకపోయారు...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Feb 06 2022, 02:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

ఐపీఎల్‌లో ఒక్క టైటిల్ గెలవలేకపోయినప్పటికీ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రేంజ్ వేరు...

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
210

2021 సంవతర్సరానికి గానూ ప్రపంచంలోనే అత్యధిక ఫాలోయింగ్ ఉన్న క్రికెట్ ఫ్రాంఛైజీగా, మూడో క్రీడా ఫ్రాంఛైజీగా నిలిచింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

310

ఆర్‌సీబీకి ఇంతటి ఫాలోయింగ్ రావడానికి విరాట్ కోహ్లీయే ముఖ్య కారణం. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 2016లో ఫైనల్ చేరినా, టైటిల్ గెలవలేకపోయింది ఆర్‌సీబీ...

410

అయితే కెరీర్ ఆరంభంలో ఆర్‌సీబీ, తనను ఘోరంగా అవమానించిందని, ఆ విషయాలు ఇప్పటికీ తనకి బాగా గుర్తున్నాయని కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ...

510

‘2008 సీజన్ తర్వాత నాకోసం ఎయిర్‌పోర్ట్‌కి ఓ ఓమ్నీ కారును పంపారు. నేను అప్పటికీ కేవలం అండర్-19 ప్లేయర్‌గా మాత్రమే ఉన్నా..

610

మిగిలిన వారికోసం ఏసీ కార్లు పంపారు. నాకు మాత్రం ఓ డొక్కు ఓమ్నీ పంపించారు. వాడికి ఏదో ఒకటి పంపి, ఎయిర్‌పోర్ట్ నుంచి తీసుకురావాలని వాళ్లు అనుకుని ఉండొచ్చు...

710

ఆ కారు కాస్త మంచిగా ఉన్నా, నేనేమీ ఫీల్ అయ్యేవాడిని కాదు. నాకు పంపిన కారు, అప్పటికే బాగా విరిగిపోయి, డొక్కుగా తయారైంది...

810

అందులో కూర్చుంటే రోడ్డుపైన వెళ్లేవన్నీ క్లియర్‌గా కనిపిస్తున్నాయి. అప్పటికే ఆ బండి షెడ్డుకి వెళ్లాల్సిన పొజిషన్‌లో ఉంది...’ అంటూ గతాన్ని గుర్తుచేసుకున్నాడు విరాట్ కోహ్లీ...

910

2008 సీజన్‌లో ఐపీఎల్‌లో ఆరంగ్రేటం చేసిన విరాట్ కోహ్లీ 15 యావరేజ్‌తో కేవలం 165 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆ సీజన్‌లో ఆర్‌సీబీ ఏడో స్థానంలో నిలిచింది...

1010

కెరీర్ ఆరంభంలో మొదటి మూడు సీజన్లు కేవలం రూ.12 లక్షలు పారితోషికంగా తీసుకున్న విరాట్ కోహ్లీ, ఆ తర్వాత గత నాలుగు సీజన్లలో రూ.17 కోట్లు తీసుకుని అత్యధిక మొత్తం అందుకున్న క్రికెటర్‌గా నిలిచాడు...

About the Author

CR
Chinthakindhi Ramu
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2026 Playoff Race: ఐపీఎల్ ప్లేఆఫ్స్ లొల్లి.. మూడు బెర్తులు కన్ఫర్మ్.. ఆ నాలుగో స్థానం ఎవరిది?
Recommended image2
IPL : ఈడు మామూలోడు కాదు బాబోయ్! ఇషాన్ కిషన్ ఊచకోతకు చెన్నై ఖేల్ ఖతం!
Recommended image3
IPL 2026: చెపాక్‌లో సన్‌రైజర్స్ ఊచకోత.. సీఎస్‌కేపై విక్టరీతో ప్లేఆఫ్స్‌లోకి హైదరాబాద్, గుజరాత్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved