IPL 2022: ఆడితే ధోనీ కెప్టెన్సీలోనే ఆడాలి... ఐపీఎల్ మెగా వేలానికి ముందు...
క్రికెటర్లలో సచిన్ టెండూల్కర్కి కూడా సాధ్యం కాని మాస్ ఫాలోయింగ్ ఎమ్మెస్ ధోనీ సొంతం. కెప్టెన్గా సూపర్ సక్సెస్ అయిన ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీలో ఆడాలని కోరుకుంటున్న క్రికెటర్ల జాబితా రోజురోజుకీ పెరుగుతూనే ఉంది...

ఐపీఎల్ 2021 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆరంగ్రేటం చేసి, అదరగొట్టిన యంగ్ పేసర్ చేతన్ సకారియా, ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీలో ఆడడం తన కల అంటూ మనసులో మాట బయటపెట్టాడు..
‘ఎమ్మెస్ ధోనీ భాయ్ కెప్టెన్సీలో ఆడాలనేది నా చిన్ననాటి కల. ఆయన ఎందరో బౌలర్లను స్టార్లుగా మలిచారు. ఆయన క్రికెట్ నాలెడ్జ్ అసాధారణం...’ అంటూ కామెంట్ చేశాడు చేతన్ సకారియా...
ఐపీఎల్ 2021 సీజన్లో 32 వికెట్లు తీసిన హర్షల్ పటేల్ కూడా తాను మాహీ భాయ్ అభిమానినేనంటూ కామెంట్ చేశాడు...
ఈసారి ధోనీ భాయ్ కెప్టెన్సీలో ఆడాలని ఉందంటూ, సీఎస్కే తరుపున బరిలో దిగాలని కోరుకుంటున్నట్టు కామెంట్ చేశాడు హర్షల్ పటేల్..
విండీస్తో వన్డే సిరీస్కి ఎంపికైన ఆల్రౌండర్ దీపక్ హుడా కూడా చిన్నతనం నుంచి మాహీ కెప్టెన్సీలో ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్నానంటూ కామెంట్ చేశాడు...
ఆర్సీబీ మాజీ ప్లేయర్ యజ్వేంద్ర చాహాల్ కూడా సీఎస్కే టీమ్ తరుపున ఆడాలని ఉందంటూ తన మనసులో కోరికను బయటపెట్టేశాడు...
సన్రైజర్స్ హైదరాబాద్ మాజీ బౌలర్ సిద్ధార్థ్ కౌల్ కూడా సీఎస్కే తన ఫెవరెట్ టీమ్ అంటూ, ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీలో ఆడాలని ఉందంటూ కామెంట్ చేయడం విశేషం...
భారత సీనియర్ స్పిన్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్తో పాటు సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియంసన్ కూడా మాహీ టీమ్లో ఆడాలనే కోరికను వ్యక్తం చేశారు...
ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ కంటే మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో ఒక్కసారి ఆడాలని ఉందనే కోరికను మెజారిటీ క్రికెటర్లు వ్యక్తం చేయడం విశేషం...
వింటే భారతం వినాలి, తింటే గారెలే తినాలి... అన్నట్టుగా ఆడితే మాహీ కెప్టెన్సీలో ఆడాలనేది ఓ సూక్తిగా మారిపోతుందేమోనని అభిప్రాయపడుతున్నారు ధోనీ ఫ్యాన్స్...