ఏప్రిల్ 11 నుంచి ఐపీఎల్ 2021... ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు...
ఐపీఎల్ 2021 సీజన్ స్వదేశంలోనే జరగనున్నట్టు తెలుస్తోంది. ముందు జాగ్రత్తగా యూఏఈని బ్యాకప్ హోస్ట్గా ఎంచుకున్న బీసీసీఐ, ఆ అవసరం లేదని స్వదేశంలోనే 14వ సీజన్ ఐపీఎల్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఏటా మార్చి చివరన, ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభయ్యే ఐపీఎల్, ఈసారి కాస్త లేటుగా ప్రారంభం కానుంది...

<p>ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 14ను ఏప్రిల్ 11 నుంచి ప్రారంభించాలని బీసీసీఐ భావిస్తోంది... </p>
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 14ను ఏప్రిల్ 11 నుంచి ప్రారంభించాలని బీసీసీఐ భావిస్తోంది...
<p>11 సాధ్యం కాకపోతే ఏప్రిల్ 14న సీజన్ మొదలుకానుంది. ఈ రెండింట్లో ఏ రోజు ప్రారంభించాలనే విషయంపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది... </p>
11 సాధ్యం కాకపోతే ఏప్రిల్ 14న సీజన్ మొదలుకానుంది. ఈ రెండింట్లో ఏ రోజు ప్రారంభించాలనే విషయంపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది...
<p>ఐపీఎల్ 2021 ఫైనల్ తేదీ జూన్ 5 లేదా జూన్ 6న ఉండవచ్చని సమాచారం... </p>
ఐపీఎల్ 2021 ఫైనల్ తేదీ జూన్ 5 లేదా జూన్ 6న ఉండవచ్చని సమాచారం...
<p>బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ అస్వస్థతకు గురి కావడంతో ఐపీఎల్ షెడ్యూల్పై నిర్వహించాల్సిన సమావేశం ఆలస్యమైంది...</p>
బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ అస్వస్థతకు గురి కావడంతో ఐపీఎల్ షెడ్యూల్పై నిర్వహించాల్సిన సమావేశం ఆలస్యమైంది...
<p>తాజాగా సౌరవ్ గంగూలీ పూర్తిగా కోలుకుని ఆసుపత్రి నుంచి డిశార్జి కూడా అయ్యారు... దీంతో త్వరలో ఈ విషయంపై సమావేశం కానుంది ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్..</p>
తాజాగా సౌరవ్ గంగూలీ పూర్తిగా కోలుకుని ఆసుపత్రి నుంచి డిశార్జి కూడా అయ్యారు... దీంతో త్వరలో ఈ విషయంపై సమావేశం కానుంది ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్..
<p style="text-align: justify;">ఐపీఎల్ 2021 సీజన్కు ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం. ముంబైతో సహా కొన్ని పరిమిత నగరాల్లోనే ఐపీఎల్ 2021 సీజన్ పోటీలు జరగనున్నాయి...</p>
ఐపీఎల్ 2021 సీజన్కు ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం. ముంబైతో సహా కొన్ని పరిమిత నగరాల్లోనే ఐపీఎల్ 2021 సీజన్ పోటీలు జరగనున్నాయి...
<p>వాంఖడే స్టేడియం, బ్రాబ్రోన్ స్టేడియం, డివై పాటిల్ స్టేడియం, నేవీ ముంబైలోని రిలయెన్స్ క్రికెట్ స్టేడియం, పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, అహ్మాదాబాద్లోని మొతేరా స్టేడియాల్లో క్రికెట్ మ్యాచులు నిర్వహించాలని ఆలోచన చేస్తోంది ఐపీఎల్ యాజమాన్యం...</p>
వాంఖడే స్టేడియం, బ్రాబ్రోన్ స్టేడియం, డివై పాటిల్ స్టేడియం, నేవీ ముంబైలోని రిలయెన్స్ క్రికెట్ స్టేడియం, పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, అహ్మాదాబాద్లోని మొతేరా స్టేడియాల్లో క్రికెట్ మ్యాచులు నిర్వహించాలని ఆలోచన చేస్తోంది ఐపీఎల్ యాజమాన్యం...
<p>మొదట దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో మ్యాచులు నిర్వహించాలని భావించినా... వివిధ రాష్ట్రాల్లో అమలులో ఉన్న ఆంక్షల దృష్ట్యా అనుమతులు రావడం కష్టమవుతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ...</p>
మొదట దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో మ్యాచులు నిర్వహించాలని భావించినా... వివిధ రాష్ట్రాల్లో అమలులో ఉన్న ఆంక్షల దృష్ట్యా అనుమతులు రావడం కష్టమవుతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ...
<p>ఐపీఎల్ 2021 మినీ వేలాన్ని చెన్నైలో ఫిబ్రవరి 18న నిర్వహించబోతున్న విషయం తెలిసిందే... ఈ లోపు ఐపీఎల్ 2021 పూర్తి షెడ్యూల్ విడుదల చేయాలని భావిస్తోంది బీసీసీఐ...</p>
ఐపీఎల్ 2021 మినీ వేలాన్ని చెన్నైలో ఫిబ్రవరి 18న నిర్వహించబోతున్న విషయం తెలిసిందే... ఈ లోపు ఐపీఎల్ 2021 పూర్తి షెడ్యూల్ విడుదల చేయాలని భావిస్తోంది బీసీసీఐ...
<p>ఐపీఎల్ ముగిసిన తర్వాత విజయ్ హాజరే ట్రోఫీని కూడా నిర్వహించేందుకు సుముఖత వ్యక్తం చేసింది బీసీసీఐ...</p>
ఐపీఎల్ ముగిసిన తర్వాత విజయ్ హాజరే ట్రోఫీని కూడా నిర్వహించేందుకు సుముఖత వ్యక్తం చేసింది బీసీసీఐ...
<p>అయితే ఎంతో చరిత్ర ఉన్న దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీకి మాత్రం ఈ ఏడాది బ్రేక్ పడింది. 87 ఏళ్ల తర్వాత తొలిసారి ఈ ఏడాది రంజీ సీజన్ నిర్వహించడం లేదు...</p>
అయితే ఎంతో చరిత్ర ఉన్న దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీకి మాత్రం ఈ ఏడాది బ్రేక్ పడింది. 87 ఏళ్ల తర్వాత తొలిసారి ఈ ఏడాది రంజీ సీజన్ నిర్వహించడం లేదు...