వచ్చే ఏడాది ఐపీఎల్ గురించి ప్రకటించిన సౌరవ్ గంగూలీ... ఎప్పుడు, ఎక్కడంటే...
IPL 2020 సీజన్ మరో మూడు రోజుల్లో ముగియనుంది. నేడు జరిగే రెండో క్వాలిఫైయర్లో విజయం సాధించిన జట్టు, మంగళవారం ముంబై ఇండియన్స్తో ఫైనల్ మ్యాచ్లో తలబడుతుంది. కరోనా వైరస్ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది ఆలస్యంగా ఆరంభమైన ఐపీఎల్, వచ్చే సీజన్ మాత్రం యాథావిథిగా జరగనుంది.
2021 ఐపీఎల్ సీజన్ ఏప్రిల్ నెలలోనే ప్రారంభం అవుతుంది... కరోనా తగ్గుతోంది కాబట్టి మనదేశంలోనే 2021 ఐపీఎల్ సీజన్ను ఘనంగా నిర్వహిస్తాం... అంటూ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ.
కరోనా పరిస్థితులను దాటి ఐపీఎల్ 2020 సీజన్ను ఛాలెంజ్గా తీసుకుని నిర్వహించింది బీసీసీఐ. యూఏఈలో దుబాయ్లో జరిగిన 2020 ఐపీఎల్ మహాసమరం, కరోనా ఉచ్చులో చిక్కుకున్న యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశాయి.
‘వచ్చే సీజన్ కూడా దుబాయ్లోనే జరుగుతుందని వార్తలు వస్తున్నాయి... కానీ ఆ వార్తల్లో నిజం లేదు. ఆస్ట్రేలియా టూర్ తర్వాత ఇంగ్లాండ్తో స్వదేశంలోనే క్రికెట్ సిరీస్ జరుగుతుంది...
దానితో పాటు రంజీ, తదితర స్వదేశీ క్రికెట్ టోర్నీలు కూడా మొదలవుతాయి. కాబట్టి వచ్చే సీజన్ భారత్లోనే... యథావిథిగా టైమ్ టేబుల్ ప్రకారం ఏప్రిల్- మే నెలలలోనే నిర్వహిస్తాం...
కరోనా పరిస్థితుల కారణంగా టోర్నీ నిర్వహణకు కావాల్సిన బయో బబుల్ను ఏర్పాటుచేస్తాం. వచ్చే సీజన్ నాటికి పరిస్థితులన్నీ అదుపులోకి వచ్చి, ప్రేక్షకులతో నిండిన స్టేడియాల్లో మ్యాచులు నిర్వహించగలుగుతామని నమ్ముతున్నాం.... అని చెప్పుకొచ్చారు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.
ప్రపంచమంతా కరోనా వైరస్తో అతలాకుతలం అవుతున్న సమయంలో దుబాయ్ వేదికగా ఐపీఎల్ నిర్వహించబోతున్నామని ప్రకటించి, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు సౌరవ్ గంగూలీ.
క్రికెటర్ల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారని అనేక రకాల విమర్శలు వచ్చినా, అన్నింటికీ ఎదురొడ్డి సమర్థవంతంగా ఐపీఎల్ 2020 సీజన్ను ప్రారంభించి, ముగింపు దశకు తీసుకొచ్చింది బీసీసీఐ.
ఐపీఎల్ 2021 సీజన్కి సంబంధించిన వేలం ఎప్పుడు మొదలవుతుందా? ఏ పద్ధతిలో జరుగుతుందనే విషయంపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు...
2020 సీజన్లో నిరాశపరిచిన చెన్నై సూపర్ కింగ్స్ వచ్చే సీజన్లో అదరగొడుతుందని ఆశగా ఎదురుచూస్తున్నారు క్రికెట్ అభిమానులు. ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా రాయల్ ఛాలెంజర్స్ కప్పు గెలవాలని ఆశగా వెయిట్ చేస్తున్నారు.
ఈ సీజన్లో ప్లేఆఫ్ అవకాశాలను రన్రేట్ కారణంగా మిస్ అయిన కేకేఆర్తో పాటు రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ జట్లు కూడా వచ్చే సీజన్లో టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇవ్వాలని ఎదురుచూస్తున్నాయి.