ఐపీఎల్ 2021పై కరోనా ప్రభావం పడడానికి కారణం ఇదే... వరుణ్ చక్రవర్తి చేసిన ఆ పని వల్లే...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 మంచి రసవత్తరంగా మారుతున్న సమయంలో కరోనా మహమ్మారి, సీజన్పై తన ప్రభావం చూపించింది. కట్టుదిట్టమైన భద్రత నడుమ, బయో బబుల్ ఏర్పాటు చేసి మ్యాచులను నిర్వహిస్తున్న బీసీసీఐకి, ఇద్దరు ప్లేయర్లకు కరోనా పాజిటివ్ రావడం ఆశ్చర్యానికి, షాక్ని కలిగించింది.
బయో సెక్యూలర్ జోన్లో నిర్వహిస్తున్న ఐపీఎల్ 2021లో కరోనా కేసులు రావడానికి ప్రధాన కారణం కేకేఆర్ ప్లేయర్ వరుణ్ చక్రవర్తి చేసిన పనేనట...
కొన్నిరోజుల క్రిందట పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తూవరుణ్ చక్రవర్తి గాయపడ్డాడు. ఈ గాయానికి స్కానింగ్ అవసరం కావడంతో ఆసుపత్రికి వెళ్లిన వరుణ్ చక్రవర్తి, ఆ తర్వాత నేరుగా జట్టుతో కలిసాడు.
బయో బబుల్ దాటి బయటికి వెళ్లిన ప్లేయర్, మళ్లీ జట్టుతో కలవాలంటే ఆరు రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. అయితే అలా చేస్తే రెండు మ్యాచులు మిస్ కావాల్సి ఉంటుందని భావించిన వరుణ్ చక్రవర్తి, క్వారంటైన్లో ఉండకుండానే జట్టులో చేరాడు.
దీంతో వరుణ్ చక్రవర్తితో పాటు అతనికి సన్నిహితంగా మెలిగిన సందీప్ వారియర్ కరనా పాజిటివ్గా తేలినట్టు తేల్చారు అధికారులు. ప్యాట్ కమ్మిన్స్ కరోనా బారిన పడినట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని నిర్ధారించారు.
స్కానింగ్ కోసం ఆసుపత్రికి వెళ్లి వచ్చిన తర్వాత వరుణ్ చక్రవర్తి, ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో కూడా పాల్గొన్నాడు. దీంతో ఆ జట్టు సభ్యులు కూడా భయాందోళనలకు గురవుతున్నారు.
కేకేఆర్ జట్టుతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ శిబిరాన్ని కూడా కరోనా తాకిన విషయం తెలిసిందే. అయితే సీఎస్కేలో ఏ ప్లేయర్కి కరోనా పాజిటివ్ రాలేదు...
బయో బబుల్లో ఉంటున్న సీఎస్కే బస్సు క్లీనర్తో పాటు సీఈవో కాశీ విశ్వనాథ్, బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ కరనా బారినపడ్డారు. వీరిలో ఎవరు ఒకరు బయో బబుల్ రూల్స్ బ్రేక్ చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు అధికారులు...