IPL 2021: సురేష్ రైనా లేడా? క్వాలిఫైయర్ మ్యాచ్లో చిన్నతలా లేకపోవడంపై ఫ్యాన్స్ షాక్...
ఐపీఎల్ 2021 ప్రీ క్లైమాక్స్ ఫైట్లో చెన్నై సూపర్ కింగ్స్, టేబుల్ టాపర్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మొదటి క్వాలిఫైయర్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కి అర్హత సాధిస్తుంది...
మొదటి క్వాలిఫైయర్లో టాస్ గెలిచిన సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది...
అయితే చెన్నై సూపర్ కింగ్స్లో సురేష్ రైనా లేకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. టాస్ జరిగిన కొన్ని సెకన్లలోనే ‘No Raina’ ట్యాగ్ ట్రెండింగ్లోకి వచ్చేసింది...
ఐపీఎల్ ప్లేఆప్స్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా సురేష్ రైనా టాప్లో ఉన్నాడు. ప్లేఆఫ్స్లో రైనా 714 పరుగులు చేయగా, ఎమ్మెస్ ధోనీ 504 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు...
10 సీజన్లలో ప్లేఆఫ్స్ ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లే, ప్లేఆఫ్స్లో అత్యధిక పరుగులు చేసిన వారిలో టాప్ 5లో ఉన్నారు... 389 పరుగులతో షేన్ వాట్సన్ టాప్ 3లో, మైక్ హుస్సీ 388 పరుగులతో టాప్ 4లో, మురళీ విజయ్ 364 పరుగులతో టాప్ 5లో ఉన్నాడు..
‘సురేష్ రైనా నిజమైన మ్యాచ్ విన్నర్. అతనికి అద్భుతమైన అనుభవం కూడా ఉంది. గత రెండేళ్లుగా రైనా పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్న విషయం నిజమే...
కానీ మ్యాచ్ను మలుపు తిప్పగల సామర్థ్యం రైనాకి ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ని ఫైనల్ చేర్చగల సత్తా ఉన్న ప్లేయర్లలో రైనా ఒకడు...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...
ఐపీఎల్ 2021 సీజన్లో ఐదు మ్యాచులు ఆడిన సురేష్ రైనా 4, 17,11, 2, 3 పరుగులతో 37 పరుగులు మాత్రమే చేయగలిగాడు...